ఎమ్మెల్యే సిద్ధారెడ్డి తీరుపై మండిపడ్డ వికలాంగుడు

ఎమ్మెల్యే సిద్ధారెడ్డి తీరుపై మండిపడ్డ వికలాంగుడు
పార్టీ కోసం కష్ట పడిన కార్యకర్తలను సిద్ధారెడ్డి పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు

కదిరి వైసీపీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి తీరుపై మండిపడ్డారు సొంత పార్టీ కార్యకర్త. పార్టీ కోసం కష్ట పడిన కార్యకర్తలను సిద్ధారెడ్డి పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాండ్లపెంట మండలానికి చెందిన వికలాంగుడైన నవీన్ కుమార్ రెడ్డి ఈ మేరకు సీఎం జగన్‌కు సెల్ఫీ వీడియో ద్వారా విజ్ఞప్తి చేశాడు. నాలుగేళ్లైనా తనకు కనీసం వీల్‌ చెయిర్‌ కూడా ఇవ్వలేకపోయారంటూ మండిపడ్డారు.

ప్రభుత్వం వికలాంగులకు ఉచితంగా ఇచ్చే మూడు చక్రాల వాహనం కావాలని అనేక సార్లు విన్నవించినా పట్టించుకోలేదన్నారు. 90% వికలాంగుడైన తాను అర్హుడ్ని కాదంటూ అధికారులు తేల్చారన్నారు. ప్రజా సమస్యల్ని పట్టించుకోని సిద్ధారెడ్డిని తొలగించాలని డిమాండ్‌ చేశారు. వచ్చే ఎన్నికల్లో మంచి వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశాడు నవీన్ కుమార్ రెడ్డి. అంతేకాదు ఎమ్మెల్యే సిద్ధారెడ్డిని విమర్శించిన విషయం తెలుసుకున్న అనుచరులు తననకు ఫోను చేసి బెదిరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

Tags

Read MoreRead Less
Next Story