PM: దేశానికి గేమ్ ఛేంజర్ "గ్రీన్ ఎనర్జీ" ప్రాజెక్టు

PM: దేశానికి గేమ్ ఛేంజర్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు
X
నేడు శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ... ఇండియాలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా విశాఖ

దేశం మొత్తానికి గ్రీన్ ఎనర్జీ ఇచ్చే భారీ ప్రాజెక్ట్ కు వైజాగ్‌లో నేడు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. లక్షా 81వేల కోట్ల పూడిమడక NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ NGEL, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి భూమి పూజ చేయనున్నారు. పెట్రోల్, డీజిల్ థర్మల్ పవర్‌ భవిష్యత్‌లో మాయం కానున్న వేళ దాని స్థానంలో గ్రీన్ ఎనర్జీ రాబోతోంది. రెన్యువల్ ఎనర్జీ వనరులైనా సోలార్, విండ్ పవర్‌కు గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ తోడు కానుంది. ప్రపంచాన్ని శాసించే ఎనర్జీ ఉత్పత్తికి విశాఖపట్నం కేరాఫ్ అడ్రస్ కాబోతోంది. ఇండియాలో అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ హబ్‌ను విశాఖలోని పూడిమడకలో NTPC నిర్మిస్తోంది. లక్ష 81వేల కోట్ల వ్యయంతో ప్రారంభమయ్యే ఈ ప్రాజెక్టు దేశం మొత్తానికి గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా మారనుంది. .

ప్రధాని ప్రారంభించే ప్రాజెక్టులు ఇవే..

విశాఖపట్నానికి బుధవారం వస్తున్న ప్రధాని మోదీ ఏకంగా రూ.2 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్నారు. విశాఖపట్నం సమీపం పూడిమడక వద్ద జాతీయ హరిత హైడ్రోజన్‌ మిషన్‌ కింద మొదటి గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌‍కు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. అత్యాధునిక ఎన్‌టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు రూ.1.85 లక్షల కోట్ల పెట్టుబడి పెడుతున్నారు. 2030 నాటికి శిలాజేతర ఇంధన సామర్థ్యం 500 గిగావాట్ల లక్ష్యాన్ని సాధించడానికి గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఏపీలో చేపడుతున్న రూ.19,500 కోట్ల విలువైన రైల్వే, రోడ్డు ప్రాజెక్టులకు సంబంధించి కొన్ని పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనుండగా.. మరికొన్నింటిని ప్రారంభిస్తారు.

గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా ఏపీ

వైజాగ్‌లో ఏర్పాటు చేయబోతున్న ప్లాంట్ భారత రవాణా రంగం రూపురేఖలనే మార్చేయనుంది. ప్రస్తుతం దేశంలో ఎమిషన్స్‌లో 40శాతం వాహనరంగం నుంచే వస్తున్నాయి. దీన్ని తగ్గించడానికి ఈ మిషన్ చాలా కీలకం. దీని నుంచి రోజూ 1500 మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్, 1500 మెట్రిక్ టన్నుల గ్రీన్ ఇథనాల్, 1500 మెట్రిక్ టన్నుల సస్టెయినబుల్ ఏవియేషన్ ఫ్యూయల్, 4500 టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి చేస్తారు. 2032 నాటికి 5మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యం. ఇప్పుటి వరకూ ఇండియాలో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ తయారీ లేదు.

Tags

Next Story