POLAVARAM: పోలవరం 88 శాతం పూర్తి

POLAVARAM: పోలవరం 88 శాతం పూర్తి
X
వచ్చే ఫిబ్రవరి నాటికి పూర్తి చేస్తామని ప్రకటించిన మంత్రి నిమ్మల

పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని సందర్శించిన మంత్రి, పనుల తీరుపై అధికారులకు పలు సూచనలు చేశారు. మంత్రి నిమ్మల రామానాయుడు ప్రాజెక్టులోని కీలక నిర్మాణాలను నిశితంగా పరిశీలించారు. ముఖ్యంగా రైట్ కనెక్టివిటీస్ పనులను. గ్యాప్-, గ్యాప్-2 ప్రాంతాలలో జరుగుతున్న నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా, ప్రాజెక్టు పనులలో నాణ్యత, వేగం విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని అధికారులను ఆదేశించారు.ప్ర­స్తుత ప్ర­భు­త్వం తొలి ఏడా­ది­లో­నే 12 శాతం పను­ల­ను పూ­ర్తి చే­సిం­ద­ని స్ప­ష్టం చే­శా­రు. రైట్ కనె­క్టి­వి­టీ­స్‌­లో 82 శాతం, లె­ఫ్ట్ కనె­క్టి­వి­టీ­స్‌­లో 62 శాతం పను­లు పూ­ర్త­య్యా­య­ని మం­త్రి వి­వ­రిం­చా­రు. డయా­ఫ్రం­వా­ల్ ని­ర్మా­ణం­లో గణ­నీ­య­మైన పు­రో­గ­తి సా­ధిం­చి­న­ట్లు మం­త్రి ని­మ్మల రా­మా­నా­యు­డు పే­ర్కొ­న్నా­రు. ఇప్ప­టి­వ­ర­కు 950 మీ­ట­ర్ల డయా­ఫ్రం­వా­ల్ ని­ర్మా­ణం జరి­గి, వాల్ పను­లు 75 శాతం పూ­ర్త­య్యా­య­ని తె­లి­పా­రు. వచ్చే ఫి­బ్ర­వ­రి నా­టి­కి కొ­త్త డయా­ఫ్రం­వా­ల్‌­ను కూడా పూ­ర్తి చే­స్తా­మ­ని ఆయన ప్ర­క­టిం­చా­రు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టు పనుల వేగం పెంచే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టు కనెక్టివిటీ, అనుబంధ పనుల కోసం భారీగా రూ.542.85 కోట్లు విడుదల చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నిధులు ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన రవాణా, రక్షణ పనులకు ఉపకరిస్తాయి. ఈ నిధులలో ముఖ్యంగా మూడు కీలకమైన నిర్మాణ పనులకు ఆమోదం లభించింది. ఈ పనులు ప్రాజెక్టు ప్రాంతంలో రాకపోకలను సులభతరం చేయడంతో పాటు, స్థానిక మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాయి.

Tags

Next Story