PULIVENDULA: జగన్ కంచుకోటపై ఎగిరిన పసుపు జెండా

PULIVENDULA: జగన్ కంచుకోటపై ఎగిరిన పసుపు జెండా
X
పులివెందుల, ఒంటిమిట్టలో టీడీపీ జయకేతనం... పులివెందుల్లో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి విజయదుందుభి... డిపాజిట్ కోల్పోయిన వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి

వై­ఎ­స్ కు­టుంబ కం­చు­కో­ట­ బద్ద­లైం­ది. పు­లి­వెం­దుల, ఒం­టి­మి­ట్ట జె­డ్పీ­టీ­సీ స్థా­నా­ల్లో టీ­డీ­పి పసు­పు జెం­డా ఎగ­రే­సిం­ది. వై­సీ­పీ కం­చు­కో­ట­గా ఉన్న స్థా­నా­ల­ను కై­వ­సం చే­సు­కో­వా­ల­న్న కూ­ట­మి పా­ర్టీ­ల ని­ర్వి­రామ కృ­షి­కి పు­లి­వెం­దుల, ఒం­టి­మి­ట్ట ప్ర­జ­లు పట్టం కట్టా­రు. 35 ఏళ్ల తర్వాత ఈ రెం­డు స్థా­నా­ల్లో పసు­పు జెం­డా ఎగి­రిం­ది. జగన్ కం­చు­కోట బద్ద­లు కా­వ­డం­తో ఇప్పు­డు వై­సీ­పీ ఉని­కే ప్ర­శ్నా­ర్థ­కం­గా మా­రిం­ది.


వైసీపీకి ఘోర పరాభవం

పు­లి­వెం­దుల జడ్పీ­టీ­సీ ఉప ఎన్ని­క­లో వై­సీ­పీ­కి ఘోర పరా­భ­వం ఎదు­రైం­ది. ఫలి­తా­ల్లో టీ­డీ­పీ అభ్య­ర్థి లతా­రె­డ్డి ఘన వి­జ­యం సా­ధిం­చా­రు. ఆమె 6,035 ఓట్ల భారీ మె­జా­ర్టీ­తో గె­లి­చా­రు. వై­సీ­పీ అభ్య­ర్థి హే­మం­త్‌­రె­డ్డి డి­పా­జి­ట్‌ కో­ల్పో­యా­రు. వై­సీ­పీ­కి 683 ఓట్లు లభిం­చా­యి. స్వ­తం­త్ర అభ్య­ర్థు­లు, కాం­గ్రె­స్‌­కు 100 లోపు ఓట్లు లభిం­చా­యి. ఈ స్థా­నా­ని­కి టీ­డీ­పీ, వై­సీ­పీ, కాం­గ్రె­స్‌ పా­ర్టీ­ల­తో పాటు స్వ­తం­త్ర అభ్య­ర్థు­లు కలి­పి 11 మంది పో­టీ­ప­డ్డా­రు. పు­లి­వెం­దుల జడ్పీ­టీ­సీ ఉప ఎన్ని­క­లో 74 శాతం ఓటిం­గ్‌ నమో­దైం­ది. పు­లి­వెం­దు­ల­లో టీ­డీ­పీ తొ­లి­సా­రి వి­జ­యం సా­ధిం­చ­గా.. అదే ఫలి­తా­ల­ను ఒం­టి­మి­ట్ట­లో­నూ రి­పీ­ట్ చే­సిం­ది. టీ­డీ­పీ అభ్య­ర్థి ము­ద్దు­కృ­ష్ణా­రె­డ్డి గె­లు­పు బా­వు­టా ఎగు­ర­వే­శా­రు. టీ­డీ­పీ అభ్య­ర్థి­కి 12, 780 ఓట్లు రాగా... వై­సీ­పీ­కి అభ్య­ర్థి ఇర­గం­రె­డ్డి సు­బ్బా­రె­డ్డి­కి 6,513 ఓట్లు మా­త్ర­మే వచ్చా­యి. దీం­తో ము­ద్దు కృ­ష్ణా­రె­డ్డి 6,267 ఓట్ల­తో వి­జ­యం సా­ధిం­చా­డు. పు­లి­వెం­దుల అభ్య­ర్థి డి­పా­జి­ట్ తె­చ్చు­కోకపో­యి­నా... ఒం­టి­మి­ట్ట­లో మాత్రం వైసీపికి డిపాజిట్ దక్కింది.

Tags

Next Story