AP: ఏపీ రాజధానిపై స్పష్టత లేదు.. అందుకే ఆఫీస్‌ పెట్టలేదు: ఆర్బీఐ

AP: ఏపీ రాజధానిపై స్పష్టత లేదు.. అందుకే ఆఫీస్‌ పెట్టలేదు: ఆర్బీఐ
ఆర్బీఐ జనరల్ మేనేజర్ సుమిత్ వెల్లడి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని విషయంలో స్పష్టత ఇవ్వకపోవడం వల్లే, RBI కార్యాలయం ఏర్పాటుపై నిర్ణయం తీసుకోలేదని ఆ సంస్థ జనరల్ మేనేజర్ సుమిత్ వెల్లడించారు. అమరావతిలో RBI కార్యాలయం ఏర్పాటుపై అఖిల భారత పంచాయితీ పరిషత్ ఏపీ అధ్యక్షుడు జాస్తి వీరాంజనేయులు 2023లో ప్రధాని కార్యాలయానికి లేఖ రాశారు. దీనిపై సమాధానం ఇవ్వాలని ప్రధాని కార్యాలయం RBIని ఆదేశించింది. ఈ మేరకు RBI అధికారులు.. జాస్తి వీరాంజనేయులుకు తిరిగి లేఖ పంపించారు. రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వనందునే RBI కార్యాలయం ఏర్పాటుచేయలేదని లేఖలో పేర్కొన్నట్టు...... జాస్తి వీరాంజనేయులు తెలిపారు. ఈ సమాధానంపై అసంతృప్తి వ్యక్తంచేసిన జాస్తి వీరాంజేయులు.... తెలుగుదేశం ప్రభుత్వం హయంలోనే రిజర్వ్ బ్యాంక్ కార్యాలయం కోసం 11 ఎకరాల భూమిని కేటాయించినట్లు గుర్తుచేశారు.

అఖిలభారత పంచాయతీ పరిషత్‌ ఏపీ అధ్యక్షుడి హోదాలో ఆయన రాసిన లేఖను.. ప్రధాని కార్యాలయం ఆర్‌బీఐకి పంపించింది. దీంతో రిజర్వు బ్యాంకు అధికారులు ఆ లేఖకు సమాధానమిచ్చారు. రాజధాని విషయం తేలనందునే కార్యాలయం ఏర్పాటు చేయలేదని వీరాంజనేయులుకు ఆర్‌బీఐ లేఖ పంపింది. ఏపీ రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని ఆర్‌బీఐ అధికారులు అందులో సమాధానమిచ్చారు. దీనిపై జాస్తి వీరాంజనేయులు ఆగ్రహం వెలిబుచ్చారు. ‘‘2016లోనే అమరావతిలో ఆర్‌బీఐకి అప్పటి తెదేపా ప్రభుత్వం 11 ఎకరాలు కేటాయించింది. కేంద్రప్రభుత్వ మ్యాప్‌లో ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తించింది. పార్లమెంట్ సాక్షిగా కూడా అమరావతి రాజధాని అని ప్రకటించింది. అయినా, ఆర్‌బీఐ అధికారులు ఏపీ రాజధాని ఏదో తెలియదన్నట్టు సమాధానమివ్వడం దారుణం’’ అని వ్యాఖ్యానించారు.

Tags

Read MoreRead Less
Next Story