
By - Sathwik |22 Sept 2024 9:00 AM IST
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు యువకులు ఘటనాస్థలంలోనే మరణించారు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం దయ్యాలకుంట గ్రామ సమీపంలో అర్థరాత్రి ఒక లారీ, కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. నార్పల నుంచి అనంతపురం కి పప్పుల లోడుతో వస్తున్న లారి.. కారును ఢీ కొట్టింది. ప్రమాదం లో మృతి చెందిన నలుగురు యువకులు కూడా అనంతపురం పట్టణానికి చెందిన వారీగా పోలీసులు గుర్తించారు. మృతులతా 24 ఏళ్ల లోపు ఉన్నవారే. మృతులను బలిజ పవన్, చాకలి పవన్, దాసరి శ్రీనివాసులు, ముస్తఫాగా గుర్తించారు. మృతులంతా కూడా స్నేహితులు కావడంతో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com