టిప్పర్ను ఢీకొన్న టాటా సుమో, కారు.. నలుగురు సజీవ దహనం

కడప జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు సజీవ దహనం అయ్యారు. వల్లూరు మండలం గోటూరు వద్ద టిప్పర్ను టాటా సుమో, కారు ఢీకొనడంతో.. మంటలు చెలరేగాయి. సుమోలో ఉన్న నలుగురు సజీవదహనం కాగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని కడప రిమ్స్కు తరలించారు. అటు.. టాటా సుమోలో ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
Next Story