SAD: విశాఖలో కొట్టుకుపోయిన విదేశీయులు

SAD: విశాఖలో కొట్టుకుపోయిన విదేశీయులు
X
వెళ్లొద్దని హెచ్చరించినా పట్టించుకోని విదేశీయులు

వి­శా­ఖ­లో అలలు తా­కి­డి­కి ఇద్ద­రు వి­దే­శీ­యు­లు కొ­ట్టు­కు­పో­యా­రు. యా­రాడ బీచ్ లో స్నా­నా­ని­కి దిగి అలలు ధా­టి­కి కొ­ట్టు­కు­పో­యా­రు. ఇటలీ నుం­చి 16 మంది పర్యా­ట­కు­లు వి­శా­ఖ­కి వచ్చా­రు. అలలు తా­కి­డి­కి కొ­ట్టు­కు­పో­యి ఓ వి­దే­శీ­యు­డు మృతి చెం­దా­డు. మరొ­క­రి పరి­స్థి­తి వి­ష­మం­గా ఉంది. సర­దా­గా గడి­పేం­దు­కు వచ్చిన వి­దే­శీ­యు­లు బీ­చ్‌­కి వచ్చా­రు. తీ­రం­లో ఆడు­కుం­టూ, తరు­వాత లో­ప­లి­కి వె­ళ్ల­గా అలలు లో­ని­కి లా­క్కు­పో­యా­యి. కే­క­లు వి­న్న స్థా­ని­కు­లు లైఫ్ గా­ర్డ్స్ కు సమా­చా­రం అం­దిం­చా­రు. కొ­ట్టు­కు­పో­తు­న్న ఇద్ద­రి­ని రక్షిం­చే ప్ర­య­త్నం గా­ర్డ్స్ ప్ర­య­త్నిం­చా­రు. కానీఫలి­తం లే­కుం­డా పో­యిం­ది.

సముద్రంలో కొట్టుకుపోయిన ఇద్దరిని రక్షించి ఒడ్డుకి తెచ్చినప్పటికీ వాళ్లలో ఒకరు అప్పటికే చనిపోయాడు. మరో విదేశీయుడు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. మృతుడి వివరాలు వెల్లడించేందుకు విదేశీయులు నిరాకరిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. న్యూ పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

భారీ వర్షాలకు సిక్కోలు అతలాకుతలం

తీ­వ్ర వా­యు­గుం­డం సి­క్కో­లు­ను నిం­డా ముం­చిం­ది. భారీ వర్షా­లు, వం­శ­ధార, నా­గ­వ­ళి నదలు వరద జనం కంటి మీద కు­ను­కు లే­కుం­డా చే­శా­యి. వేల ఎక­రా­ల్లో పంట పొ­లా­లు నీట ము­ని­గా­యి. వం­శ­ధార, నా­గ­వ­ళి శాం­తిం­చ­డం­తో ముం­పు గ్రా­మా­లు తే­రు­కుం­టు­న్నా­యి. రో­డ్లు ధ్వం­స­మైన చోట అధి­కా­రు­లు తా­త్కా­లిక మర­మ్మ­తు­లు చే­స్తు­న్నా­రు. పా­త­ప­ట్నం, ఆమ­దా­ల­వ­లస, ఇచ్ఛా­పు­రం, పలాస, నర­స­న్న­పేట, శ్రీ­కా­కు­ళం ని­యో­జ­క­వ­ర్గా­ల్లో­ని వే­లా­ది ఎక­రా­లు ఇంకా ముం­పు­లో­నే ఉన్నా­యి. నదు­లు, వా­గు­లు, వం­క­లు పొం­గి­పా­ర్లా­యి. వం­శ­ధార, నా­గా­వ­ళి నదు­లు ఉప్పొం­గి ప్ర­వా­హిం­చా­యి. దీం­తో సమీప ప్రాంత పం­ట­పొ­లా­ల్లో­కి నడు­ము­లో­తు నీ­ళ్లు చే­రా­యి. హి­ర­మం­డ­లం­లో నా­లు­గు అడు­గు­ల­కు పైగా పె­రి­గిన వరి చే­ల­ల్లో కూడా వరద నీరు ముం­చె­త్తిం­ది. మూడు రో­జు­లు అవు­తు­న్నా పొ­లా­ల్లో తగ్గ­క­పో­వ­డం­తో రై­తు­లు తీ­వ్ర ఆవే­దన వ్య­క్తం చే­స్తు­న్నా­రు. ఇప్ప­టి­వ­ర­కూ తమను ఎవరూ పరా­మ­ర్శిం­చ­లే­ద­ని వా­పో­యా­రు. కష్టం­లో ఉన్న తమను ఆదు­కో­వా­ల­ని కో­రు­తు­న్నా­రు. శ్రీ­కా­కు­ళం జి­ల్లా­లో 8 వేల ఎక­రా­ల్లో పంట జరి­గి­న­ట్లు అధి­కా­రు­లు అం­చ­నా వే­శా­రు.

Tags

Next Story