SANKRANTHI: సంక్రాంతికి పోలీసుల ముందస్తు ప్రణాళికలు

SANKRANTHI: సంక్రాంతికి పోలీసుల ముందస్తు ప్రణాళికలు
X
సంక్రాంతికి భారీగా స్వగ్రామాలకు నగరవాసులు.. హైదరాబాద్ నుంచి ఏపీకి భారీగా వాహనాలు... టోల్‌గేట్లు, ట్రాఫిక్ జాం కాకుండా చర్యలు

సం­క్రాం­తి పం­డుగ సమీ­పి­స్తుం­డ­టం­తో రహ­దా­రు­ల­పై ప్ర­యా­ణి­కుల రద్దీ పె­రి­గే సూ­చ­న­లు కని­పి­స్తు­న్నా­యి. ము­ఖ్యం­గా హై­ద­రా­బా­ద్‌ నుం­చి ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­కు వె­ళ్లే వా­హ­నా­లు ఉమ్మ­డి నల్గొండ జి­ల్లా మీ­దు­గా భారీ సం­ఖ్య­లో ప్ర­యా­ణిం­చ­ను­న్న నే­ప­థ్యం­లో ట్రా­ఫి­క్ సమ­స్య­లు తలె­త్త­కుం­డా పో­లీ­సు­లు వి­స్తృత ఏర్పా­ట్లు చే­స్తు­న్నా­రు. జా­తీయ రహ­దా­రు­ల­పై జరు­గు­తు­న్న వం­తె­నల ని­ర్మా­ణా­లు, టో­ల్‌ గే­ట్ల వద్ద వా­హ­నాల ని­లు­పు­దల వంటి అం­శా­ల­ను పరి­గ­ణ­న­లో­కి తీ­సు­కు­ని ముం­ద­స్తు­గా ప్ర­ణా­ళి­క­లు రూ­పొం­దిం­చా­రు. సం­క్రాం­తి ముం­దు, పం­డుగ రో­జు­లు, పం­డుగ అనం­త­రం ప్ర­యా­ణి­కు­ల­కు ఎలాం­టి ఇబ్బం­దు­లు ఎదు­రు­కా­కుం­డా ట్రా­ఫి­క్ డై­వ­ర్ష­న్లు, నిఘా చర్య­లు అమలు చే­యా­ల­ని సూ­ర్యా­పేట జి­ల్లా పో­లీ­స్‌ అధి­కా­రు­లు ని­ర్ణ­యిం­చా­రు. రద్దీ ఎక్కు­వ­గా ఉండే మా­ర్గా­ల­ను గు­ర్తిం­చి ప్ర­త్యా­మ్నాయ దా­రు­ల­ను అం­దు­బా­టు­లో­కి తీ­సు­కు­వ­స్తు­న్నా­రు. హై­ద­రా­బా­ద్‌ నుం­చి గుం­టూ­రు వైపు వె­ళ్లే వా­హ­నా­ల­ను నా­ర్క­ట్‌­ప­ల్లి వద్ద దారి మళ్లిం­చ­ను­న్నా­రు. అక్క­డి నుం­చి నల్గొండ, మి­ర్యా­ల­గూడ, పి­గు­డు­రా­ళ్ల మీ­దు­గా గుం­టూ­రు వైపు వె­ళ్లే­లా ఏర్పా­ట్లు చే­శా­రు. ఈ మా­ర్గం ద్వా­రా వా­హ­నా­లు సజా­వు­గా ప్ర­యా­ణిం­చే అవ­కా­శం ఉం­టుం­ద­ని అధి­కా­రు­లు తె­లి­పా­రు. రా­జ­మం­డ్రి, వి­శా­ఖ­ప­ట్నం వైపు వె­ళ్లే వా­హ­నా­ల­కు కూడా ప్ర­త్యేక మా­ర్గా­ల­ను సూ­చిం­చా­రు. నకి­రే­క­ల్‌ మీ­దు­గా అర్వ­ప­ల్లి, మరి­పెడ బం­గ్లా, ఖమ్మం మీ­దు­గా వా­హ­నా­ల­ను మళ్లి­స్తా­రు. ఈ మా­ర్గం­లో ట్రా­ఫి­క్ అం­త­రా­యం ఏర్ప­డి­తే, టే­కు­మ­ట్ల నుం­చి ఖమ్మం జా­తీయ రహ­దా­రి మీ­దు­గా రా­జ­మం­డ్రి ది­శ­గా వా­హ­నా­ల­ను పంపే ఏర్పా­ట్లు చే­శా­రు.

హైదరాబాద్‌–విజయవాడ రహదారిపై ఇప్పటివరకు అమలులో ఉన్న టేకుమట్ల డైవర్షన్‌ను తొలగించనున్నారు. గతంలో టేకుమట్ల వద్ద యూ-టర్న్ తీసుకుని తిరిగి సూర్యాపేట వైపు రావాల్సి ఉండేది. అయితే, ప్రస్తుతం జాతీయ రహదారిపై నేరుగా వాహనాలు వెళ్లేలా తాత్కాలిక రహదారిని నిర్మించారు ఖమ్మం నుంచి హైదరాబాద్‌ వెళ్లే వాహనాలకు కూడా కొత్త ప్రణాళికలు రూపొందించారు. గతంలో రాయినిగూడెం వైపు వెళ్లి యూ-టర్న్ తీసుకోవాల్సి ఉండేది. ఇప్పుడు చివ్వెంల, ఐలాపురం వద్ద దారి మళ్లించి సూర్యాపేట మీదుగా హైదరాబాద్‌కు వెళ్లే ఏర్పాట్లు చేశారు.

ఈ ఏడాది ట్రాఫిక్ నియంత్రణలో ఆధునిక సాంకేతికతను వినియోగించనున్నారు. సూర్యాపేట జిల్లా పరిధిలోని జాతీయ రహదారిపై డ్రోన్‌ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎక్కడైనా వాహనాలు అధిక సంఖ్యలో నిలిచిపోయినట్లు గుర్తిస్తే వెంటనే అక్కడికి సిబ్బందిని పంపి సమస్యను పరిష్కరిస్తారు. సూర్యాపేట గ్రామీణం, సూర్యాపేట, మునగాల, కోదాడ, కోదాడ గ్రామీణ సీఐల ఆధ్వర్యంలో పండుగకు ముందు రోజుల నుంచే, పండుగ అనంతరం ఐదు రోజుల వరకు సిబ్బంది నిరంతరం ట్రాఫిక్ పర్యవేక్షణ చేపట్టనున్నారు. హైవే పెట్రోలింగ్ వాహనాలు నాలుగు రౌండ్లు గస్తీ నిర్వహించనున్నాయి.

Tags

Next Story