ఏపీలో దారుణం.. సరస్వతి దేవి విగ్రహంపై మద్యం పోసి, బాటిళ్లతో దాడి

X
By - Nagesh Swarna |6 Oct 2020 2:44 PM IST
ఏపీలో దేవాలయాలపై దాడులు ఆగడంలేదు. తాజాగా గుంటూరు జిల్లా నరసరావుపేటలో మరో దారణం చోటు చేసుకుంది. శృంగేరీ శంకర మఠం సమీపంలో ఉన్న సరస్వతీ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. విగ్రహంపై మద్యం పోసి, బాటిళ్లతో దాడి చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
విగ్రహం ధ్వంసంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవతల విగ్రహాలపై దాడులు జరుగుతున్నా.. అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు బాధ్యులైనవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com