నవంబర్ 2 నుంచి బడికెళ్లాలోచ్..

కరోనా వైరస్ కారణంగా మూతపడ్డ పాఠశాలలు, కాలేజీలు నవంబర్ 2 నుంచి తెరుచుకోనున్నాయి. పాఠశాలలు మూడు దశల్లో రోజు విడిచి రోజు తరగతులను నిర్వహిస్తారు. ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ విద్యాశాఖ అధికారులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని క్లాసుల పునః ప్రారంభానికి సంబంధించిన షెడ్యూల్ను వివరించారు.
నవంబర్ 2 నుంచి 9,10, ఇంటర్ మొదటి, రెండు సంవత్సర తరగతులు రోజు విడిచి రోజు జరుగుతాయి. ఒకపూట మాత్రమే క్లాసులు జరుగుతాయి. ఇక 6,7,8 తరగతులకు క్లాసులు నవంబర్ 23 నుంచి జరుగుతాయి. వీరికి కూడా రోజు విడిచి రోజు ఒకపూట మాత్రమే తరగతులు నిర్వహిస్తారు. ప్రైమరీ సెక్షన్ పిల్లలు అంటే 1,2,3,4,5 తరగతులు చదివే చిన్నారులకు డిసెంబర్ 14 నుంచి స్కూల్ ఉంటుంది. వాళ్లకి కూడా రోజు విడిచి రోజు బడి, ఒక్కపూటే తరగతులు నిర్వహిస్తామని విద్యాశాఖ అధికారులు తెలియజేశారు.
నవంబర్ 2 నుంచి పాఠశాలలు, కాలేజీలు పునః ప్రారంభం కానున్నాయి.
నవంబర్ 2 నుంచి 9,10,11/ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ,12 / ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం తరగతులు రోజు విడిచి రోజు నడపనున్నారు. హాఫ్డే మాత్రం నిర్వహిస్తారు.
హయ్యర్ ఎడ్యుకేషన్కు సంబంధించి అన్ని కాలేజీలకూ కూడా నవంబర్ 2నుంచే తరగతులు ప్రారంభిస్తారు. రొటేషన్ పద్ధతిలో ఈ తరగతులను నిర్వహిస్తారు.
నవంబర్ 23 నుంచి 6,7,8 క్లాసులకు బోధన ప్రారంభం అవుతుంది. రోజు విడిచి రోజు, హాఫ్ డే పాటు క్లాసులు నిర్వహిస్తారు.
డిసెంబర్ 14 నుంచి 1,2,3,4,5 తరగతులను ప్రారంభిస్తారు. రోజువిడిచి రోజు, హాఫ్ డే పాటు క్లాసులు నిర్వహిస్తారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com