గొల్లలగుంట పంచాయతీ.. మృతుని కుటుంబాన్ని పరామర్శించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ

X
By - prasanna |2 Feb 2021 2:13 PM IST
మృతదేహాన్ని కాకినాడ నుంచి వచ్చిన వైద్య నిపుణుల సమక్షంలో పెద్దాపురం ప్రభుత్వ
తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం గొల్లలగుంటలో సర్పంచ్ అభ్యర్ధి భర్త చనిపోవడంతో ఆ కుటుంబాన్ని పరామర్శించారు ఎస్ఈసీ నిమ్మగడ్డ. అభ్యర్ధి భర్త మృతిపై కుటుంబానికి పలు అనుమానాలున్నాయని, విచారణ ద్వారా నిజాలు తెలియాల్సి ఉందని అన్నారు. మృతదేహాన్ని కాకినాడ నుంచి వచ్చిన వైద్య నిపుణుల సమక్షంలో పెద్దాపురం ప్రభుత్వ ఆస్పత్రిలో శవపంచనామా నిర్వస్తారని, గొల్లలగుంట పంచాయతీ ఎన్నికల అంశాన్ని తర్వాత పరిశీలిస్తామని చెప్పారు. మృతుని భార్య అభ్యర్థన మేరకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. గొల్లలగుంట ఘటనను రాజకీయ కోణంలో కాకుండా, మానవీయ కోణంలో చూడాలన్నారు నిమ్మగడ్డ.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com