Mangalagiri: మైనర్‌ బాలికపై గ్యాంగ్ రేప్

Mangalagiri: మైనర్‌ బాలికపై గ్యాంగ్ రేప్
పలుమార్లు అత్యాచారం చేసిన దుండగులు; పోలీసులకు చెబితే చంపేస్తామని బెదిరింపులు

ఏపీలోని గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. మంగళగిరిలో ఓ బాలికపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఇద్దరు యువకులు 11 ఏళ్ల బాలికకు మాయ మాటలు చెప్పి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు.ఈ విషయం బయటికి చెప్పినా, పోలీసులకు చెప్పినా చంపేస్తామని బాలికను బెదిరించారు. దీంతో బాధిత బాలిక, ఆమె కుటుంబ సభ్యులు ఎవరికీ చెప్పకుండా మౌనంగా ఉన్నారు. తల్లిదండ్రులు పని కోసం బయటకు వెళ్లిన తర్వాత మరోసారి ఆ బాలికపై అత్యాచారం చేశారు. దీంతో ఆగ్రహించిన బాలిక తల్లిదండ్రులు మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.ఈ ఘటన మహిళా కమిషన్‌ కార్యాలయానికి చేరువలో జరిగింది.

పోలీసుల రాకను గమనించిన విష గుళికలు మింగాడు నిందితుడు. అయితే అతనికి ప్రాణపాయం లేదని నిర్ధారించుకున్న పోలీసులు.ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాధిత బాలికను గుంటూరు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై వివరణ కోరిన మీడియాపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story