Shivarathri : కోటప్పకొండలో శివరాత్రి ఉత్సవాలు

X
By - Vijayanand |18 Feb 2023 4:40 PM IST
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కోటప్పకొండకు వచ్చే భక్తులకు టీడీపీ నేత నల్లపాటి రాము అన్నదానం ఏర్పాటు చేశారు
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కోటప్పకొండకు వచ్చే భక్తులకు టీడీపీ నేత నల్లపాటి రాము అన్నదానం ఏర్పాటు చేశారు. 30 వేల మందికి పైగా భక్తులకు పులిహోర, తాగునీరు, మజ్జిగ పంపిణీ చేశామని తెలిపారు. రాత్రి పది గంటల వరకు భక్తులకు పులిహోర, మంచినీరు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశామని నల్లపాటి స్పష్టం చేశారు. మరోవైపు అధికార పార్టీకి చెందిన వారికే వీఐపీ పాస్లు ఇచ్చి మిగతావారికి పాసులు ఇవ్వకుండా అవమానించారని నల్లపాటి రాము ఆరోపించారు. భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం, అధికారులు ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com