సింహాచలం దేవస్థానం ఏఈవో శ్రీనివాసరావుపై వేటు

సింహాచలం దేవస్థానం ఏఈవో శ్రీనివాసరావుపై వేటు

సింహాచలం దేవస్థానం ఏఈవో శ్రీనివాసరావుపై వేటు పడింది. ఏఈవోను సస్పెండ్‌ చేస్తూ దేవాదాయశాఖ ప్రత్యేక కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో దేవస్థానం భూ పరిరక్షణ విభాగంలో శ్రీనివాసరావు ఏఈవోగా పని చేశారు. ఐతే.. భూ పరిరక్షణ విభాగంలో అవినీతి పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. విచారణ అనంతరం అప్పటి ఈవో భ్రమరాంబ.. శ్రీనివాసరావు విభాగాన్ని మార్చారు. ప్రస్తుతం పరిపాలన విభాగంలో పలు సెక్షన్లకు ఏఈవోగా ఉన్న శ్రీనివాసరావుపై వేటు వేశారు.

Tags

Next Story