గల్లంతైన ఆరుగురి మృతదేహాలు లభ్యం

గల్లంతైన ఆరుగురి మృతదేహాలు లభ్యం

పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడులో విషాదం చోటు చేసుకుంది. భూదేవిపేట గ్రామం నుంచి శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు కోసం వచ్చిన ఆరుగురు యువకులు వాగులో స్నానానికి దిగి గల్లంతయ్యారు. స్థానికులు, గజ ఈతగాళ్లు గాలించి ముగ్గురు యువకుల మృతదేహాలను బయటకు తీశారు. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఇంటి నుంచి వెళ్లిన తమ పిల్లలు మృత్యువాత పడటంతో... తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోధనకు స్థానికులను కలిచివేశాయి.

Tags

Read MoreRead Less
Next Story