గల్లంతైన ఆరుగురి మృతదేహాలు లభ్యం
By - kasi |28 Oct 2020 9:59 AM GMT
పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడులో విషాదం చోటు చేసుకుంది. భూదేవిపేట గ్రామం నుంచి శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు కోసం వచ్చిన ఆరుగురు యువకులు వాగులో స్నానానికి దిగి గల్లంతయ్యారు. స్థానికులు, గజ ఈతగాళ్లు గాలించి ముగ్గురు యువకుల మృతదేహాలను బయటకు తీశారు. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఇంటి నుంచి వెళ్లిన తమ పిల్లలు మృత్యువాత పడటంతో... తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోధనకు స్థానికులను కలిచివేశాయి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com