జగన్, కేసీఆర్లు ఒకటే.. జలవివాదం విషయంలో కుమ్మక్కయ్యారు : సోమువీర్రాజు

X
By - TV5 Digital Team |11 July 2021 5:27 PM IST
విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. స్టీల్ప్లాంట్ యథావిధంగా పనిచేస్తుందన్న ఆయన.. దానిని అమ్మే ప్రసక్తేలేదని పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో డైరీలు, స్పిన్నింగ్ మిల్లులు అమ్మేస్తుంటే ఎదుకు ప్రతిపక్షాలు ప్రశ్నించడం లేదన్నారు. ఇక కేసీఆర్, జగన్లు పగలు పోరాటం.. రాత్రి వెన్నెల్లో దోస్తీ నడుపుతున్నారని విమర్శించారు. జలవివాదాల విషయంలో ఇద్దరు సీఎంలు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. జలవివాదాల విషయంలో ఇద్దరు సీఎంలు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. రాయలసీమ నీటి ప్రాజెక్టుల విషయంలో త్వరలోనే బీజేపీ వైఖరి స్పష్టం చేస్తామన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com