Srisailam: మంత్రి పెద్దిరెడ్డి కాళ్లు మొక్కిన శ్రీశైలం ఈవో లవన్న
![Srisailam: మంత్రి పెద్దిరెడ్డి కాళ్లు మొక్కిన శ్రీశైలం ఈవో లవన్న Srisailam: మంత్రి పెద్దిరెడ్డి కాళ్లు మొక్కిన శ్రీశైలం ఈవో లవన్న](https://www.tv5news.in/h-upload/2023/02/20/904139-lavannasrisailam.webp)
By - Subba Reddy |20 Feb 2023 9:45 AM GMT
శ్రీశైలం వచ్చిన మంత్రి పెద్దిరెడ్డికి ఆలయం ముందే వంగి వంగి దండాలు
శ్రీశైలం దేవస్థానం ఈవో లవన్న అంతులేని స్వామి భక్తి ప్రదర్శించారు. మంత్రి పెద్దిరెడ్డి కాళ్లు మొక్కారు. శ్రీశైలం వచ్చిన మంత్రి పెద్దిరెడ్డికి ఆలయ ఈవో ఘనంగా స్వాగతించారు. ఆలయం ముందే వంగి వంగి దండాలు పెట్టారు. కాళ్లు మొక్కి తన స్వామి భక్తిని ప్రదర్శించారు. శివమాలలో ఉన్న లవన్న మంత్రి కాళ్లు మొక్కడం వివాదాస్పదమైంది. ఐతే.. ఈవో లవన్న తీరుపై శివ భక్తులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. పవిత్రమైన శివమాలలో ఉన్న ఈవో.. మంత్రి పాదాలపై పడి.. శివమాలను.. హిందూ సాంప్రదాయాలను ఘోరంగా అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com