STAMPADE: ప్రచారమే ప్రాణం తీసిందా?

STAMPADE: ప్రచారమే ప్రాణం తీసిందా?
X
కాశిబుగ్గ ఆలయంలో తొక్కిసలాటపై పలు అనుమానాలు

శ్రీ­కా­కు­ళం­లో­ని తొ­క్కి­స­లాట ఘటన తర్వాత అనేక వి­ష­యా­లు వె­లు­గు­లో­కి వస్తు­న్నా­యి. ఈ ఆలయ ని­ర్మాణ ధర్మ­క­ర్త గతం­లో తి­రు­మ­ల­కు వె­ళ్లి­న­ప్పు­డు దర్శ­నం కా­క­పో­వ­టం­తో 12 ఎక­రాల సొంత భూ­మి­లో ఆల­యా­న్ని ని­ర్మిం­చా­రు. చి­న్న తి­రు­ప­తి­గా ప్ర­సి­ద్ధి చెం­దిన ఈ క్షే­త్రం దర్శ­నా­లు మే నుం­చి ప్రా­రం­భ­మ­య్యా­యి. దీం­తో ఈ ఆలయం గు­రిం­చి SMలో వి­స్తృత ప్ర­చా­రం జరి­గిం­ది. ప్ర­తి­రో­జు ఆల­యా­ని­కి 1000 మంది భక్తు­లు వస్తుం­డ­గా నేడు దా­దా­పు 25వేల మంది వచ్చా­రు.

దేవాదాయశాఖ పరిధిలో లేదు

శ్రీ­కా­కు­ళం జి­ల్లా కా­శీ­బు­గ్గ­లో­ని వెం­క­టే­శ్వర స్వా­మి ఆలయం వద్ద తొ­క్కి­స­లా­ట­లో 12 మంది మృతి చెం­దిన దు­ర్ఘ­ట­న­పై దే­వా­దా­య­శాఖ మం­త్రి ఆనం రా­మ­నా­రా­యణ రె­డ్డి తీ­వ్ర ది­గ్భ్రాం­తి వ్య­క్తం చే­శా­రు. ఈ ఘటన గు­రిం­చి దే­వా­దా­య­శాఖ ఉన్నత అధి­కా­రు­ల­తో వి­వ­రా­లు అడి­గి తె­లు­సు­కు­న్నా­ను. మృతి చెం­దిన వారి కు­టుం­బా­ల­కు ప్ర­గాఢ సా­ను­భూ­తి తె­లి­య­జే­స్తు­న్నా­ను. ఈ తొ­క్కి­స­లా­ట­లో గా­య­ప­డిన వా­రి­కి మె­రు­గైన వై­ద్యం అం­ద­చే­యా­ల­ని మం­త్రి ఆనం రా­మ­నా­రా­యణ రె­డ్డి అదే­శా­లు జారీ చే­శా­రు. దీం­తో హు­టా­హు­టిన శ్రీ­కా­కు­ళం బయ­లు­దే­రిన దే­వా­దా­య­శాఖ ఉన్నత అధి­కా­రు­లు.. ఈ సం­ద­ర్భం­గా మం­త్రి మా­ట్లా­డు­తూ.. తొ­క్కి­స­లాట ఘటన జరి­గిన ఆలయం దే­వా­దా­య­శాఖ పరి­ధి­లో లేదు అన్నా­రు. అది పూ­ర్తి­గా ప్రై­వే­ట్ ఆలయం.. ని­ర్వా­హ­కు­లు సరైన భద్ర­తా ఏర్పా­ట్లు చే­య­లే­ద­ని తె­లి­పా­రు. ప్ర­భు­త్వా­ని­కి ని­ర్వా­హ­కు­లు సమా­చా­రం ఇవ్వ­లే­దు.. ముం­దే సమా­చా­రం ఇస్తే సరైన జా­గ్ర­త్త­లు తీ­సు­కు­నే వా­ళ్ల­మ­ని చె­ప్పా­రు.

భక్తుల మరణం కలచివేసింది: మోదీ

ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­లో­ని శ్రీ­కా­కు­ళం­లో­ని శ్రీ వెం­క­టే­శ్వర స్వా­మి ఆల­యం­లో జరి­గిన తొ­క్కి­స­లా­ట­లో తొ­మ్మి­ది మంది మర­ణిం­చ­డం­పై రా­ష్ట్ర­ప­తి ద్రౌ­ప­ది ము­ర్ము ది­గ్భ్రాం­తి వ్య­క్తం చే­శా­రు. మృ­తుల కు­టుం­బా­ల­కు ప్ర­గాఢ సా­ను­భూ­తి తె­లి­పా­రు. గా­య­ప­డిన వారు త్వ­ర­గా కో­లు­కో­వా­ల­ని ప్రా­ర్థి­స్తు­న్నా­ను. శ్రీ­కా­కు­ళం జి­ల్లా కా­శీ­బు­గ్గ­లో గల వేం­క­టే­శ్వ­ర­స్వా­మి ఆల­యం­లో జరి­గిన తొ­క్కి­స­లాట ఘట­న­లో 9 మంది మర­ణిం­చా­రు. ఈ ఘట­న­పై ఉప­రా­ష్ట్ర­ప­తి సీపీ రా­ధా­కృ­ష్ణ­న్ తీ­వ్ర వి­చా­రం వ్య­క్తం చే­శా­రు. తొ­క్కి­స­లాట ఘట­న­లో ఇలా ప్రా­ణ­న­ష్టం జర­గ­డం చాలా బా­ధ­క­ర­మ­న్నా­రు. క్షతగాత్రులు ఉన్న­వా­రు త్వ­ర­గా కో­లు­కో­వా­ల­ని ప్రా­ర్థి­స్తు­న్నా­న­ని పే­ర్కొ­న్నా­రు.

నా మనసును కలచివేసింది: మోదీ

కా­శీ­బు­గ్గ­లో వేం­క­టే­శ్వ­ర­స్వా­మి ఆల­యం­లో జరి­గిన తొ­క్కి­స­లాట ఘట­న­పై ప్ర­ధా­ని మోదీ ది­గ్భ్రాం­తి వ్య­క్తం చే­శా­రు. ఈ ఘటన జర­గ­డం వి­చా­ర­క­ర­మ­ని సో­ష­ల్ మీ­డి­యా వే­ది­క­గా స్పం­దిం­చా­రు. ‘‘ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­లో­ని శ్రీ­కా­కు­ళం జి­ల్లా­లో గల వేం­క­టే­శ్వ­ర­స్వా­మి ఆల­యం­లో జరి­గిన తొ­క్కి­స­లాట ఘటన బా­ధా­క­రం. తమ కు­టుంబ సభ్యు­ల­ను కో­ల్పో­యిన వారి గు­రిం­చే నా ఆలో­చ­నం­తా. క్ష­త­గా­త్రు­లు త్వ­ర­గా కో­లు­కో­వా­ల­ని ప్రా­ర్థి­స్తు­న్నా’’ అని మోదీ వి­చా­రం వ్య­క్తం చే­శా­రు. మృ­తుల కు­టుం­బా­ల­కు రూ.2 లక్షల చొ­ప్పున, గా­య­ప­డిన వా­రి­కి రూ.50,000 చొ­ప్పున ఎక్స్‌­గ్రే­షి­యా అం­ద­జే­స్తా­మ­ని పీ­ఎంఓ కా­ర్యా­ల­యం ప్ర­క­టిం­చిం­ది. ఈ ఘట­న­పై కేం­ద్ర హోం­మం­త్రి అమి­త్‌ షా స్పం­ది­స్తూ.. ‘‘తొ­క్కి­స­లా­ట­లో భక్తు­లు ప్రా­ణా­లు కో­ల్పో­వ­డం తీ­వ్ర ది­గ్భ్రాం­తి కలి­గిం­చిం­ది. మృ­తుల కు­టుం­బా­ల­కు నా ప్ర­గాఢ సా­ను­భూ­తి తె­లి­య­జే­స్తు­న్నా’’ అని వి­చా­రం వ్య­క్తం చే­శా­రు. పలు­వు­రు కేం­ద్ర­మం­త్రు­లు, పలు రా­ష్ట్రాల ము­ఖ్య­మం­త్రు­లు కా­శి­బు­గ్గ ఆల­యం­లో జరి­గిన తొ­క్కి­స­లా­ట­పై స్పం­దిం­చా­రు. మృ­తుల కు­టుం­బా­ల­కు ప్ర­గాఢ సా­ను­భూ­తి తె­లి­పా­రు. భక్తుల మరణం తమను తీ­వ్రం­గా కల­చి­వే­సిం­ద­ని పలు­వు­రు రా­జ­కీయ నే­త­లు తీ­వ్ర ఆవే­దన వ్య­క్తం చే­శా­రు. భక్తు­లు మె­ట్లు ఎక్కు­తుం­డ­గా రద్దీ కా­ర­ణం­గా రె­యి­లిం­గ్​ ఊడి­ప­డిం­ది. రె­యి­లిం­గ్​ ఊడి­పో­వ­డం­తో ఒక­రి­పై ఒకరు పడి 9 మంది మృతి చెం­దా­రు.

Tags

Next Story