Supreme Court : జగన్ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు..

Supreme Court : జగన్ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు..
Supreme Court : జగన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

Supreme Court : జగన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. నార్మన్‌ అండ్‌ పోస్టర్ కంపెనీ జగన్‌ ప్రభుత్వంతో మధ్యవర్తిత్వానికి సుప్రీంలో పిటిషన్ వేసింది. టీడీపీ హయాంలో నార్మన్‌ అండ్‌ పోస్టర్ కంపెనీనే అమరావతి నిర్మాణానికి డిజైన్లు రెడీ చేసింది. అయితే, జగన్‌ అధికారంలోకి వచ్చాక.. అమరావతి నిర్మాణాన్ని పక్కన పెట్టారు. కాని, నార్మన్‌ అండ్ పోస్టర్ కంపెనీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధులు బకాయి పడింది. దీంతో తమకు రావాల్సిన నిధుల కోసం పోస్టర్ కంపెనీ మధ్యవర్తిత్వం నోటీసులు ఇచ్చింది.

కాని, నార్మన్‌ అండ్‌ పోస్టర్‌ కంపెనీ ఇచ్చిన నోటీసులను జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. తమ నోటీసులకు జగన్ ప్రభుత్వం స్పందించకపోవడంతో పోస్టర్ కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పోస్టర్‌ సంస్థ పిటిషన్‌ను సీజేఐ ఎన్వీ రమణ ధర్మాసనం విచారణకు స్వీకరించింది. అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

Tags

Read MoreRead Less
Next Story