Supremecourt: అమరావతిపై విచారణ 28కి వాయిదా
By - Subba Reddy |27 Feb 2023 6:00 AM GMT
త్వరగా విచారణ జరపాలని కోరిన ఏపీ ప్రభుత్వం
అమరావతి రాజధానిపై సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్ చేసిన పిటిషన్ పై విచారణ మార్చి 28కు వాయిదా పడింది.పిటిషన్ త్వరగా విచారణకు తీసుకోవాలని కోరింది ఏపీ ప్రభుత్వం. జస్టిస్ కేఎం జోసెఫ్,జస్టిస్ బీవీ నాగరత్నం ధర్మాసనం ముందు ప్రత్యేకంగా ప్రస్తావించారు ఏపీ ప్రభుత్వ తరుపు న్యాయవాదులు. అయితే సీజేఐ సర్కులర్ కారణంగా గత బుధ,గురువారాల్లో విచారణ నిలుపుదల చేసింది ధర్మాసనం.అయితే తేదీని ఖరారు చేయాలని ధర్మాసనం ముందు ప్రత్యేకంగా ప్రస్తావించడంతో విచారణను వచ్చే నెల 23కు వాయిదా వేసింది సుప్రీం ధర్మాసనం.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com