AP: జీవో1 పై సుప్రీంలో పిటీషన్..ఈ నెల 24న విచారణ

AP: జీవో1 పై సుప్రీంలో పిటీషన్..ఈ నెల 24న విచారణ
రాజకీయ పార్టీల ర్యాలీలను నిషేదిస్తూ జీవో 1 ను జారీ చేసిన సర్కార్‌.జీవో 1 ను ఏపీ హైకోర్టులో సవాల్‌ చేశారు సీపీఐ రామకృష్ణ

జగన్‌ సర్కార్‌ తెచ్చిన జీవో1 పై సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు అయింది. పిటీషన్ పై ఈ నెల 24న విచారణకు స్వీకరించింది CJI చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం. ఏపీలో రాజకీయ పార్టీల ర్యాలీలను నిషేదిస్తూ జీవో 1 ను జారీ చేసింది జగన్‌ సర్కార్‌. అయితే జీవో 1 ను ఏపీ హైకోర్టులో సవాల్‌ చేశారు సీపీఐ నేత రామకృష్ణ. ఆయన పిటీషన్ ను విచారణ జరిపి తీర్పు రిజర్వు చేసింది ఏపీ హైకోర్టు ధన్మాసనం. అయితే తీర్పు జాప్యం అవుతున్న నేపధ్యంలో సుప్రీం కోర్టును ఆశ్రయించారు పిటీషనర్లు.

Tags

Read MoreRead Less
Next Story