Tarakaratna: తారకరత్నకోసం తెలుగు యువత పూజలు
By - Subba Reddy |9 Feb 2023 9:15 AM GMT
వెంకటనగరం సాయిబాబా ఆలయంలో 108 కొబ్బరికాయాలు కొట్టి ప్రత్యేక పూజలు
టీడీపీ యువనాయకుడు తారకరత్న ఆరోగ్యం మెరుగుపడాలని తెలుగుయువత, టీడీపీ నాయకులు పూజలు నిర్వహించారు. రాజ మండ్రిలోని తొర్రేడు, కాతేరు టీడీపీ నాయకులు నున్న క్రిష్ణ, తూర్పుగోదావరి జిల్లా తెలుగుయువత ప్రధాన కార్యదర్శి కురుకూరి కిషోర్ ఆధ్వర్యంలో పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. వెంకటనగరం సాయిబాబా ఆలయంలో 108 కొబ్బరికాయాలు కొట్టి తారక రత్న ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు తారకరత్న ఒక్కసారిగా కుప్పకూలిపోవడం బాధ కలిగించిందన్నారు. తారకరత్న తొందరగా కోలుకోవాలని దేవుణ్ణి కోరుకున్నట్లు చెప్పారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com