Anantapur: అనంతపురం జిల్లాలో విస్తరిస్తున్న క్షయ వ్యాధి

అనంతపురం జిల్లాలో క్షయ వ్యాధిగ్రస్తుల సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. పోషకాహారానికి దూరమైన అనేక మంది పేదలు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఏటా 50 నుంచి 80 మంది క్షయవ్యాధితో మృత్యువాత పడుతున్న పరిస్థితులు జిల్లాలో ఆందోళన కలిగిస్తున్నాయి.
ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో కోవిడ్ అనంతరం..... క్షయవ్యాధి ఎక్కువగా విస్తరించినట్లు వైద్య వర్గాలు భావిస్తున్నాయి. కరోనా కారణంగా ప్రజల ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది కరంగా మారడంతో, పౌష్ఠికాహారం మాట అటుంచి..కనీసం రోజువారీ ఆహారం సమకూర్చులేక ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. ముఖ్యంగా....... గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలు, నగరాల్లోని మురికి వాడల్లో ప్రజలు పోషకాహారానికి దూరమై క్షయవ్యాధి బారిన పడినట్లు తెలుస్తోంది.
కేంద్ర ప్రభుత్వం టీబీ వ్యాధి మందులు ఉచితంగా పంపిణీ చేస్తున్నా....., వాటిని వినియోగిస్తున్న రోగులకు పౌష్ఠికాహారం అందడం లేదు. క్షయ రోగం నయం కావడానికి..... మందులు 50 శాతం పనిచేస్తే, పుష్ఠికరమైన ఆహారం మరో 50 శాతం మేర ఉపకరిస్తుందనేది అధ్యయనాల్లో స్పష్టమైంది. క్షయ వ్యాధి లక్షణాలున్న రోగులకు నెలరోజులకు సరిపడా ఔషధ కిట్ ఇచ్చి పంపుతున్నారు. 30 శాతం పైగా రోగులు ఈ మందులు వేసుకున్న తర్వాత పౌష్ఠికాహారం తీసుకోకపోవడంతో కడుపులో మంట, కళ్లు తిరగడం వంటి లక్షణాలతో మందులు ఆపేస్తున్నారు. ఇలాంటి వారితో రోగనిరోధక శక్తిలేని మరికొందరికి ఈ వ్యాధి సోకుతోందని తెలుస్తోంది.
2025 నాటికి క్షయను నిర్మూలిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆచరణలో మాత్రం సాధ్యం కావడంలేదనేది అనంతపురం జిల్లాను పరిశీలిస్తే తెలుస్తుందని సామాజిక వేత్తలు చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com