వైసీపీకి ఓటేస్తే పన్నుల బాదుడే ఉంటుంది : చంద్రబాబు

X
By - TV5 Digital Team |6 March 2021 7:45 PM IST
విశాఖ జగదాంబ సెంటర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు.. వైసీపీ సర్కార్పై నిప్పులు చెరిగారు.
వైసీపీకి ఓటేస్తే పన్నుల బాదుడే ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. విశాఖ జగదాంబ సెంటర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు.. వైసీపీ సర్కార్పై నిప్పులు చెరిగారు. ఎన్నికలు ముగియగానే వైసీపీ ప్రభుత్వం పన్ను బాదుడుకు సిద్ధమవుతోందని.. గతంలో తాను హుద్ హుద్ తుఫాను సందర్భంగా మీకు అండగా నిలిచిన విషయాన్ని గుర్తుంచుకోవాలని విశాఖ ఓటర్లను చంద్రబాబు కోరారు. అలాగే వైసీపీ ప్రభుత్వ హయాంలో దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాని అక్రమంగా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు చంద్రబాబు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com