పార్లమెంటు కొత్త భవనంపై చంద్రబాబు ట్వీట్‌

పార్లమెంటు కొత్త భవనంపై చంద్రబాబు ట్వీట్‌
2047 నాటికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తయ్యే నాటికి పేదరికం లేని భారతదేశం ఏర్పాటుకు కొత్త పార్లమెంటు భవనం దిక్సూచి కావాలన్నారు చంద్రబాబు.

పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవంపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్‌ చేశారు.. కొత్త పార్లమెంటు భవన నిర్మాణం చరిత్రాత్మకమైనదన్నారు.. ఈ చారిత్రక కట్టడాన్ని నిర్మించడంలో దోహదపడిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రానికి ధన్యవాదాలు అంటూ చంద్రబాబు ట్వీట్‌ చేశారు.. దేశ భవిష్యత్తుకు అవసరమైన మార్పులు, చట్టాల రూపకల్పనకు ఈ భవనం వేదిక కావాలని ఆకాంక్షించారు.. 2047 నాటికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తయ్యే నాటికి పేదరికం లేని భారతదేశం ఏర్పాటుకు కొత్త పార్లమెంటు భవనం దిక్సూచి కావాలన్నారు చంద్రబాబు.

ఈనెల 28 నూతన పార్లమెంట్‌ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.. ఈ కార్యక్రమానికి రావాలంటూ అన్ని రాజకీయ పార్టీలకు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ ఆహ్వానాలు పంపారు.. ఎన్డీయే పక్షాలతోపాటు మరికొన్ని ప్రాంతీయ పార్టీలు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు ప్రకటించాయి.. కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి హాజరు కావాలని టీడీపీ కూడా నిర్ణయించింది.. టీడీపీ తరపున హాజరు కావాల్సిందిగా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌కు చంద్రబాబు సూచించారు.

https://twitter.com/ncbn/status/1661680901317615616

Tags

Read MoreRead Less
Next Story