వారిని కఠినంగా శిక్షించాలంటూ టీడీపీ నేతల ఆందోళన
By - kasi |12 Nov 2020 1:18 PM GMT
అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు కారణమైనవారిని కఠినంగా శిక్షించాలంటూ టీడీపీ నేతలు ఆందోళన బాట పట్టారు.. విజయవాడలోని ఎంపీ కేశినేని..
అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు కారణమైనవారిని కఠినంగా శిక్షించాలంటూ టీడీపీ నేతలు ఆందోళన బాట పట్టారు.. విజయవాడలోని ఎంపీ కేశినేని నాని కార్యాలయం దగ్గర కాగడాలు, కొవ్వొత్తులతో భారీ ప్రదర్శన చేపట్టారు.. ఈ నిరసన ర్యాలీలో ఎంపీ నాని, నెట్టెం రఘురాం, బొండా ఉమా, బొద్దా వెంకన్న ఇతర నేతలు పాల్గొన్నారు. అయితే ర్యాలీకి పోలీసులు అనుమతివ్వకపోవడంతో కేశినేని భవన్ వద్దే కాగడాలు, కొవ్వుతులతో నిరసన తెలిపారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com