అమరావతి ప్రాంతంలో టీడీపీ నేతల బృందం పర్యటన

అమరావతి ప్రాంతంలో టీడీపీ నేతల బృందం పర్యటన
అమరావతి ప్రాంతంలోని వెంకటపాలెం సీడ్‌ యాక్సిస్‌ వద్ద గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను టీడీపీ నేతల..

అమరావతి ప్రాంతంలోని వెంకటపాలెం సీడ్‌ యాక్సిస్‌ వద్ద గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను టీడీపీ నేతల బృందం పరిశీలించింది.. రాజధాని రైతులు, దళితులు, అమరావతి జేఏసీతో కలిసి మాజీ మంత్రి దేవినేని ఉమ, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ ఆ ప్రాంతంలో పర్యటించారు. రాజధానిలో గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలని వారు డిమాండ్‌ చేశారు.. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులు అన్యాయానికి గురవుతున్నారని మండిపడ్డారు. రాజధానిలో 5,500 ఇళ్లను గత ప్రభుత్వం నిర్మిస్తే వాటిని లబ్ధిదారులకు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగులేసుకునే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారని మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు.

Tags

Read MoreRead Less
Next Story