నాడు- నేడు అభివృద్ధి పనులను పరిశీలించిన టీడీపీ ఎమ్మెల్యే

X
రాజమహేంద్రవరం 45వ డివిజన్లోని పాఠశాలలో చేపట్టిన నాడు- నేడు అభివృద్ధి పనులను పరిశీలించిన టీడీపీ ఎమ్మెల్యేఅధికారులతో కలిసి పరిశీలించారు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని శ్రీనివాస్. విద్యార్ధుల కోసం చేపట్టిన టాయిలెట్స్ నిర్మాణాలు, మంచినీటి కుళాయిలు, అదనపు తరగతుల నిర్మాణాలు.. ఇతర అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. నాడు- నేడు పథకంలో భాగంగా పాఠశాలల్లో చేపడుతున్న పనుల్లో నాణ్యత ఉండాలని అధికారులకు సూచించారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని శ్రీనివాస్. విద్యార్ధులకు కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు. పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్య పెరిగే విధంగా కృషి చేయాలన్నారు. అలాగే విద్యార్ధుల ఉన్నతికి కృషి చేయాలన్నారు ఎమ్మెల్యే.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
