Rajamundry: నీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి సదస్సు

Rajamundry: నీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి సదస్సు
X
ప్రాజెక్టుల స్థితిగతులపై మేధావులకు చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోలవరం నిర్వాసితులను మోసం చేసిన దుర్మార్గుడు జగన్ అని విరుచుకుపడ్డారు. రాజమహేంద్రవరంలో నీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి సదస్సు జరిగింది. ప్రాజెక్టుల స్థితిగతులపై మేధావులకు చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

మూర్ఖుడి దగ్గర అధికారం ఉంటే.. రాష్ట్రానికి ఎంత నష్టమో పోలవరం విధ్వంసం ఒక ఉదాహరణ అని ఆరోపించారు. నాలుగేళ్లలో ఏ ఒక్కరికీ పరిహారం అందలేదని.. నిర్వాసితుల జాబితా మార్చి అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. పట్టిసీమతో సమానంగా ఎకరానికి 19 లక్షల పరిహారం ఇస్తానన్న జగన్ హామీ ఏమైందని ప్రశ్నించారు. పోలవరం నిర్వాసితులకు కేంద్ర నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కలిపి టీడీపీ పునరావాసం కల్పించిందన్నారు. అలాగే శరవేగంగా ఇళ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పరిధిలో కొత్తగా ఒక్క కట్టడమూ జగన్ చేపట్టలేదని ధ్వజమెత్తారు. ఇంకా 214 కట్టడాలు కట్టాల్సి ఉందన్న చంద్రబాబు.. 50 శాతం కనెక్టివిటీ పనులు పెండింగ్‌లోనే ఉన్నాయని అన్నారు.

పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్‌ను పారిశ్రామిక, తాగునీటి అవసరాల కోసం విశాఖ నగరానికి సుమారు 23 టిఎంసిలు నీటిని సరఫరా చేయాలని నిర్ణయిస్తే వైసీపీ ఆటకెక్కించిందని చంద్రబాబు ఆరోపించారు. నిర్వాసితులకు ఇచ్చిన హామీపై సమాధానం చెప్పలేక తప్పించుకుని తిరుగుతూ ఎదురుదాడి చేయటం జాతి ద్రోహమే అని అన్నారు. గ్రేట్ మేధావులు అని చెప్పుకునేవారు.. ఇప్పుడైనా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతారా లేక ఏపీని ఇంకా అథఃపాతాళానికి నెట్టేస్తారో ఆలోచించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Tags

Next Story