ప్రేమోన్మాదులకు చుట్టంగా దిశ చట్టం : తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత
By - kasi |2 Nov 2020 11:44 AM GMT
విశాఖ పోలీసు కమిషనరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. వరలక్ష్మిని హత్య చేసిన నిందితుడు అఖిల్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ.. తెలుగు మహిళలు..
విశాఖ పోలీసు కమిషనరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. వరలక్ష్మిని హత్య చేసిన నిందితుడు అఖిల్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ.. తెలుగు మహిళలు ఆందోళనకు దిగారు. సీపీని కలిసేందుకు యత్నించారు. పోలీసులు అనుమతివ్వకపోవడంతో రోడ్డుపై బైఠాయించారు. దిశ చట్టం ప్రేమోన్మాదులకు చుట్టంగా మారిందని టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల అలసత్వం వల్లే నేరస్తులు రెచ్చిపోతున్నారని ఆరోపించారు. ప్రాణాలు కోల్పోయి వారికి సీఎం.. రేటు కడుతున్నారని విమర్శించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com