MANMOHAN: మన్మోహన్ మృతి దేశానికి తీరని లోటు

MANMOHAN: మన్మోహన్ మృతి దేశానికి తీరని లోటు
X
సంతాపం తెలిపిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు... ఘన నివాళి అర్పించిన కేంద్రమంత్రులు

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.గొప్ప ఆర్థికవేత్తల్లో ఒకరు, నాయకులు, సంస్కర్త, అన్నింటికంటే మించి మన కాలంలోని మానవతావాది మన్మోహన్ సింగ్ జీ ఇక లేరని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సద్గుణం, నిష్కళంకమైన సమగ్రత, నిర్ణయం తీసుకోవడంలో అన్నింటికంటే మానవీయతో చూసే వ్యక్తి మన్మోహన్ అని గుర్తు చేశారు. డాక్టర్ సింగ్ న్యూ ఇండియాకు నిజమైన వాస్తు శిల్పుల్లో ఒకరన్నారు. ఆయన మరణం భారతదేశం ఒక గొప్ప కుమారుడిని కోల్పోయిందని రేవంత్ ట్వీట్ చేశారు.

చంద్రబాబు సంతాపం

మాజీ ప్రధాన మంత్రి, ప్రఖ్యాత ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ జీ మరణం పట్ల తీవ్ర ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. మేధావి రాజనీతిజ్ఞుడు, వినయం, జ్ఞానం, కలగలిపిన వ్యక్తి మన్మోహన్ అని చంద్రబాబు అన్నారు. 1991లో ఆర్థిక మంత్రిగా ఆయన చేసిన ఆర్థిక సంస్కరణల నుంచి ప్రధానమంత్రిగా ఆయన నాయకత్వం వరకు దేశానికి అవిశ్రాంతంగా సేవలందించి లక్షలాది మందిని ఉద్ధరించారని తెలిపారు. ఆయన మృతి దేశానికి తీరని లోటని.... ఆయన కుటుంబానికి, ఆత్మీయులకు, అభిమానులకు నా హృదయపూర్వక సానుభూతని చంద్రబాబు ట్వీట్ చేశారు.

దేశాన్ని కొత్త పుంతలు తొక్కించిన నేత: పవన్ కల్యాణ్

భారత దేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దివంగతులయ్యారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని తెలిపారు. భారత దేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలకు ఆద్యుల్లో ఒకరు మన్మోహన్ సింగ్ ఒకరన్నారు. దేశానికి మన్మోహన్ అందించిన సేవలు చిరస్మరణీయమైనవని పవన్ గుర్తు చేసుకున్నారు.

కిషన్ రెడ్డి సంతాప సందేశం

"భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా, ప్రణాళికా సంఘంలో కీలక బాధ్యతల్లో, యూజీసీ చైర్మన్ గా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా వారు దేశానికి వన్నెతీసుకొచ్చారు" అని కిషన్ రెడ్డి తెలిపారు.

Tags

Next Story