WOMENS DAY: మహిళా సాధికారతే లక్ష్యం

WOMENS DAY: మహిళా సాధికారతే లక్ష్యం
X
మహిళలకు శుభాకాంక్షలు తెలిపిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

ప్రతి సంవత్సరం మార్చి 8న మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. ఈ ప్రత్యేక దినాన్ని మహిళల హక్కులు, సాధికారత, సమానత్వం కోసం పోరాడుతున్న వారి కోసం అంకితం చేశారు. సమాజంలో వారికి సమాన హక్కులు, అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని గుర్తించాలి. మహిళల భద్రత, విద్య, ఆర్థిక స్వావలంబన, రాజకీయం రంగాల్లో ఇంకా మార్పులు రావాల్సి ఉంది. మహిళల హక్కులను పరిరక్షించేందుకు, వారి సాధికారత కోసం కృషి చేద్దామని ప్రముఖులు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు CM చంద్రబాబు, మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. ‘మహిళా దినోత్సవం జరుపుకోవటం ఆనవాయితీ కాదు. ఇది సమాజ బాధ్యత. TDP పార్టీ ఆవిర్భావం నుంచి మహిళా సాధికారత కోసమే పనిచేస్తోంది. మహిళా శక్తి అపారం. సమాన అవకాశాలు కల్పించి ప్రోత్సహిస్తే అద్భుతంగా రాణిస్తారు. మహిళా సంక్షేమం, భద్రత కోసం ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోంది. ’ అని చంద్రబాబు, లోకేష్ తెలిపారు.

నేడు మార్కాపురానికి చంద్రబాబు

ప్రకాశం జిల్లా మార్కాపురంలో నేడు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. మహిళా ఆర్థిక స్వావలంబన కోసం పలు పథకాలను ప్రకటించనున్నారు. ఈ-వ్యాపారి పోర్టల్ ద్వారా రూ.5 కోట్ల మహిళా ఉత్పత్తుల డెలివరీకి శ్రీకారం చుట్టనున్నారు.

మహిళాభ్యున్నతే ప్రధాన లక్ష్యం: జగన్

అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా మ‌హిళ‌లంద‌రికీ వైసీపీ అధినేత జగన్ శుభాకాంక్షలు తెలిపారు. 'మ‌హిళలు బాగుంటేనే ఆ కుటుంబం బాగుంటుంది. కుటుంబాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రం బాగుంటే దేశం కూడా బాగుంటుంది అని గట్టిగా నమ్మే వ్యక్తిని. నా భవిష్యత్ రాజకీయ ప్ర‌స్థానం కూడా మహిళాభ్యున్నతే ప్రధాన లక్ష్యంగా సాగుతుంది.' అంటూ జగన్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

Tags

Next Story