Amaravathi :రాజధానిపై ఏడుపు రాతలు రాసినా.. ప్రజల ఎదురు దాడులు

Amaravathi :రాజధానిపై ఏడుపు రాతలు రాసినా.. ప్రజల ఎదురు దాడులు
X
వరద తాకని రాజధాని

భారీ వర్షాలతో వాగులు, వంకలు ఉధృత రూపం దాల్చడంతో రాజధాని అమరావతి ప్రాంతం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. హైకోర్టు, సచివాలయం పరిసర ప్రాంతాల చుట్టూ నీరు చేరింది. ఎమ్మెల్యేలు, ఐఏఎస్‌ అధికారుల నివాస భవనాల లోపలికి నీరు ప్రవహించింది. ఇతర ప్రభుత్వ భవనాలు సైతం జలమయమయ్యాయి. రహదారులు.. వాగులు, వంకలుగా మారాయి. రాజధాని ప్రాంతంలో ఏర్పాటైన ఎస్‌ఆర్‌ఎం, విట్‌ యూనివర్సిటీలు సైతం నీటమునిగాయి. రహదారులు నీటితో నిండిపోయి నదుల్ని తలపిస్తుండటంతో రాజధాని ప్రాంతానికి రెండు రోజులుగా ప్రయాణాలు పూర్తిగా నిలిచిపోయాయి. భారీ నుంచి అతి వర్షాలకు కొండవీటి వాగు ఉప్పొంగింది. అదే సమయంలో కృష్ణా నది ఉగ్రరూపం దాల్చింది. ప్రకాశం బ్యారేజ్‌లోని ఉండవల్లి అవుట్‌పాల్‌ స్లూయిజ్‌ల ద్వారా కృష్ణా వరద కొండవీటి వాగులోకి ఎగదన్నింది. రాజధాని అమరావతిని కొండవీటి వాగు వరద చుట్టుముట్టింది. తుళ్లూరు మండలంలోని కోటేళ్లవాగు, అయ్యన్నవాగు, నక్కవాగు, పాలవాగుల ద్వారా వచ్చే వరద ఉధృతి కూడా కొండవీటి వాగులో ప్రవహించాల్సిన పరిస్థితి రావడంతో రాజధానికి నీటి గండం తప్పడం లేదు. ముంపు ప్రాంతమైన అమరావతిలో రాజధాని వద్దని శివరామకృష్ణన్, బోస్టన్, జీఎన్‌ రావు కమిటీలు మొత్తుకున్నా చంద్రబాబు పెడచెవిన పెట్టారు. పైగా ఏడాదికి మూడు పంటలు పండే సారవంతమైన భూములను రైతులను భయపెట్టి, బెదిరించి సేకరించారు. ఆంధ్రుల కలల రాజధాని గురించి ఇలా రాసుకుంటూ పోయింది బ్లూ మీడియా. ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించింది, ప్రయత్నిస్తోంది.

కానీ దుష్ప్రచారానికి భిన్నంగా...

అమరావతి నీట మునిగిందంటూ దుష్ప్రచారానికి దిగినవారికి తెలుగు ప్రాంత ప్రజలు గట్టిగా సమాధానమిస్తున్నారు. ఏ సోషల్ మీడీయా వేదికగా, పత్రికల్లో, టీవీల్లో వాస్తున్న వార్తలను అదేవిధంగా తిప్పికొడుతున్నారు. రాజధానికి అత్యంత అనువైన, సురక్షితమైన ప్రాంతామని నెటిజన్లు తెలుపుతున్నారు. గత 5 సంవత్సరాలు రాజధానిని పట్టించుకోకుండా, ఇప్పుడు మళ్లీ అమరావతి గురించి చెడ్డ ప్రచారం చేస్తున్న వారిని అడ్డుకుంటున్నారు. మునిగిపోయింది అన్నవారికి వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ దీటుగా సమాధానమిస్తున్నారు. నవ్యాంధ్ర రాజధానిని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న కుయుక్తులను పసిగట్టి పాతరేస్తున్నారు. అమరావతికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడ మహానగరం వరద ముంపునకు గురయింది. గుంటూరులోనూ భారీవర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో వైసీపీ అమరావతి మునిగిపోయిందంటూ ప్రచారం మొదలుపెట్టింది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరేలా ఉంది. హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ భవనాలను నిర్మించే కోర్‌ క్యాపిటల్‌ ప్రాంతం అత్యంత సురక్షితంగా ఉన్నాయి. రాజధాని గ్రామాల్లో వర్షం కారణంగా నిలిచిన నీరు తప్ప ఎక్కడా వరద ఆనవాలు లేదు.

నిక్షేపంగా నవనగరం

రాజధాని అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించే సమయంలోనే అప్పటి టీడీపీ ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంది. రాజధాని గ్రామాల్లో ముంపునకు కారణమయ్యేందుకు ఉన్నది కేవలం కొండవీటి వాగేనని గుర్తించింది. దాని ముంపు నుంచి రాజధానిని రక్షించేందుకు అప్పట్లోనే చర్యలు చేపట్టింది. అత్యధిక వరద వచ్చినప్పుడు సమస్య తలెత్తకుండా లిఫ్టులను ఏర్పాటు చేసింది. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ లిఫ్టులను వాడకుండా కొండవీటి వాగు వరద నీటితో అమరావతిని ముంపు బారిన పడేలా చేయాలని ప్రయత్నించిందన్న ఆరోపణలు ఉన్నాయి. రాజధానికి భూ సేకరణకు ముందు ఆ ప్రాంతంలో కొండవీటి వాగు వరద సమస్య సృష్టిస్తూ ఉండేది. కానీ టీడీపీ ప్రభుత్వం దాని వరద కోసం ప్రత్యేకంగా ఎత్తిపోతల పధకం ఏర్పాటు చేయడంతో ఈసారి ఆ వాగు ప్రవాహం సాఫీగా వెళ్లిపోయింది.

Tags

Next Story