TIRUMALA: తిరుమలలో అందుబాటులోకి ఏఐ టెక్నాలజీ

TIRUMALA: తిరుమలలో అందుబాటులోకి ఏఐ టెక్నాలజీ
X
శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలు

శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు ఏఐ ఆధారిత ఐసీసీసీ కేంద్రాన్ని టీటీడీ అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని భక్తుల రద్దీని పర్యవేక్షిస్తారు. క్యూలైన్లో ఎక్కువసేపు నిరీక్షిస్తున్న వారిని త్వరగా దర్శనానికి పంపింస్తారు. అలాగే అన్నప్రసాదాల వితరణను పర్యవేక్షిస్తారు. ఫేస్ రికగ్నిషన్ కెమెరాలతో నేర చరిత్ర ఉన్నవారి డేటాను అనుసంధానించి అనుమానితులను గుర్తించనున్నారు.

టీటీడీ భక్తుల సౌకర్యార్థం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో భక్తుల రద్దీని అంచనా వేయడం, ఫేస్ రికగ్నిషన్ ద్వారా గుర్తింపు, సైబర్ దాడులను అడ్డుకోవడం వంటి చర్యలు తీసుకుంటారు. ఐసీసీసీలో 25 మందికి పైగా సిబ్బంది సీసీటీవీ ఫుటేజీలను పర్యవేక్షిస్తూ, ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తారు. అలిపిరి నుంచే ఏఐ సాంకేతికతతో భక్తుల రద్దీని అంచనా వేస్తున్నారు. క్యూలైన్లలో ఎంతమంది ఉన్నారు? ఎంత సమయం వేచి ఉన్నారు? సర్వదర్శనం పరిస్థితి ఏమిటి? అనే విషయాలను ఏఐ ట్రాక్ చేస్తుంది.

ఇలా ఉపయోగపడుతుంది....

ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో భక్తులను గుర్తుపట్టవచ్చు. చోరీలు, ఇతర నేరాలు జరిగినా వెంటనే గుర్తించవచ్చు. తప్పిపోయిన వారిని కూడా సులువుగా కనుగొనవచ్చు. భక్తుల ముఖ కవళికలను బట్టి వారి ఇబ్బందులను తెలుసుకునే అవకాశం ఉంది. క్యూలైన్లు, వసతి వంటి సౌకర్యాలను 3డీ మ్యాప్‌ల ద్వారా చూపిస్తారు. రద్దీగా ఉండే ప్రాంతాలను రెడ్ స్పాట్స్ ద్వారా గుర్తించి, వెంటనే చర్యలు తీసుకుంటారు. ఆన్‌లైన్‌లో వచ్చే సైబర్ దాడులను, టీటీడీ పరువు తీసేలా సోషల్ మీడియాలో పెట్టే పోస్టులను అడ్డుకుంటారు.

Tags

Next Story