TIRUMALA: తిరుమల శ్రీవారి చెంత భక్త జన సంద్రం

TIRUMALA:  తిరుమల శ్రీవారి చెంత భక్త జన సంద్రం
X
భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల...సెలవుల నేపథ్యంలో భారీగా భక్తుల రాక...సర్వ దర్శనానికి 30 గంటల సమయం.. క్యూ లైన్లలోని వారికి పాలు, నీళ్లు,టీ

తి­రు­మల శ్రీ­ని­వా­సు­డి దర్శ­నా­ని­కి భక్తు­లు భా­రీ­గా తరలి వస్తు­న్నా­రు. వరుస సె­ల­వు­లు కా­ర­ణం­గా స్వా­మి­ని దర్శిం­చు­కో­వ­డా­ని­కి వచ్చిన భక్తు­ల­తో ఏడు కొం­డు­లు జన­సం­ద్రం­తో నిం­డి­పో­యా­యి. ఈ క్ర­మం­లో టీ­టీ­డీ వి­స్తృత ఏర్పా­ట్లు చే­సి­న­ప్ప­టి­కీ గం­ద­ర­గో­ళం ఏర్ప­డిం­ది. అలి­పి­రి భూ­దే­వీ కాం­ప్లె­క్స్‌­లో భక్తుల మధ్య తో­పు­లాట చోటు చే­సు­కుం­ది. దర్శన టి­కె­ట్లు తీ­సు­కు­నే టైం­లో గం­ద­ర­గో­ళం ఏర్ప­డిం­ది. దీం­తో ఏర్పా­ట్లు సరి­గా లే­వ­ని భక్తు­లు ఆరో­పిం­చా­రు. టి­కె­ట్ కౌం­ట­ర్లు పెం­చా­ల­ని డి­మాం­డ్ చే­శా­రు. సా­మా­న్య భక్తు­ల­కు అధిక ప్రా­ధా­న్యత ఇస్తా­మం­టు­న్న టీ­టీ­డీ సి­ప­డా కౌం­ట­ర్‌­లు కూడా ఏర్పా­టు చే­య­డం లేదా అని ప్ర­శ్ని­స్తు­న్నా­రు.


దీ­ని­పై అధి­కా­రు­లు స్పం­దిం­చా­రు. టీ­టీ­డీ సీ­వీ­ఎ­స్వో ము­ర­ళీ­కృ­ష్ణ మా­ట్లా­డు­తూ... సె­ల­వుల కా­ర­ణం­గా తి­రు­ప­తి­లో­ని భూ­దే­వి కాం­ప్లె­క్స్ వద్ద భక్తుల రద్దీ భా­రీ­గా పె­రి­గిం­ద­న్నా­రు. SSD టో­కె­న్లు పూ­ర్తి­కా­వ­డం­తో ది­వ్య­ద­ర్శ­నం టో­కె­న్ల కోసం భక్తు­లు కౌం­ట­ర్ల వద్ద­కు చే­రు­కు­న్నా­ర­ని తె­లి­పా­రు. పరి­స్థి­తి­ని వెం­ట­నే గమ­నిం­చిన వి­జి­లె­న్స్, సె­క్యూ­రి­టీ, పో­లీ­సు సి­బ్బం­ది భక్తు­ల­ను క్ర­మ­బ­ద్ధీ­క­రిం­చా­ర­ని వి­వ­రిం­చా­రు. " దర్శన టో­కె­న్లు పూ­ర్త­య్యా­య­ని భక్తు­ల­కు స్ప­ష్టం­గా తె­లి­య­జే­శాం. అక్కడ ఎలాం­టి లా­ఠీ­చా­ర్జ్ గానీ, తొ­క్కి­స­లాట గానీ జర­గ­లే­దు. పరి­స్థి­తి పూ­ర్తి­గా అదు­పు­లో­నే ఉంది. భక్తు­లు సి­బ్బం­ది సూ­చ­న­లు పా­టిం­చా­ల­ని, సో­ష­ల్ మీ­డి­యా­లో వచ్చే తప్పు­డు వదం­తు­ల­ను నమ్మ­వ­ద్ద­ని కో­రు­తు­న్నాం. వదం­తు­లు వ్యా­ప్తి చే­సే­వా­రి­పై చట్ట­ప­ర­మైన చర్య­లు తీ­సు­కుం­టాం" అని హె­చ్చ­రిం­చా­రు. తిరుమలలో భారీగా భక్తులు ఉండడంతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఎస్పీ కీలక సూచనలు

తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు కూడా పలు సూచినలు చేశారు. "సెలవుల కారణంగా తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ముందుగానే కేటాయించిన 15,000 SSD టోకెన్లు పూర్తిగా పంపిణీ చేయడం జరిగింది. కోటా పూర్తి కావడంతో టోకెన్ జారీ చేసే కౌంటర్లను అధికారులు మూసివేశారు. SSD టోకెన్లు అయిపోవడంతో, దివ్యదర్శనం టోకెన్లు ఇస్తారనే ఆశతో సుమారు 500 నుంచి 600 మంది భక్తులు అక్కడే వేచి ఉన్నారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉంది. పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ భక్తులను క్రమబద్ధీకరిస్తున్నారు. అక్కడ ఎలాంటి లాఠీచార్జ్ గానీ, తొక్కిసలాట గానీ జరగలేదు. దీనిపై వస్తున్న తప్పుడు వదంతులను భక్తులు నమ్మవద్దని కోరుతున్నా" అని విజ్ఞప్తి చేశారు.

Tags

Next Story