sad: చెరువులో ఈతకు దిగి 8 మంది చిన్నారులు మృతి

sad: చెరువులో ఈతకు దిగి 8 మంది చిన్నారులు మృతి
X
వైఎస్సార్ జిల్లాలో అయిదుగురు, ఏలూరు జిల్లాలో ముగ్గురు చిన్నారుల మృతి

వైఎస్సార్‌ జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లెలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చెరువులో ఈతకు దిగిన ఐదుగురు బాలలు మరణించడం అందర్నీ శోకసంద్రంలో ముంచింది. వేసవి సెలవులు రావడంతో మల్లేపల్లెకి చెందిన ఉప్పలపాటి నారాయణ యాదవ్‌ ఇంటికి చెల్లెళ్లు సావిత్రి, భవాని హైదరాబాద్‌ నుంచి తమ పిల్లలతో కలిసి వచ్చారు. సమ్మర్ కావడంతో సరదాగా చెరువుకు వెళ్లి ఈత కొడదామనుకున్నారు. సావిత్రి కుమారుడు హర్ష, భవాని పిల్లలు చరణ్, పార్థు, మల్లేపల్లె గ్రామానికి చెందిన మేకల గంగాధర్‌ కుమారుడు తరుణ్‌ యాదవ్, కాశినాయన మండలం మల్లేరు కొట్టాలకు చెందిన నారాయణ కుమారుడు దీక్షిత్‌ మల్లేపల్లిలోని చెరువు వద్దకు వెళ్లారు. రాత్రి అయినా పిల్లలు ఇంటికి తిరిగి రాకపోవడంతో చుట్టుపక్కల వెతికారు. చెరువు ఒడ్డున పిల్లల బట్టలు కనిపించడంతో దాంతో బాలురు చెరువులో గల్లంతైనట్లు భావించారు. పోలీసుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టగా రాత్రి 11 గంటల తర్వాత బాలుర మృతదేహాలు లభ్యమయ్యాయి. మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్ తో పాటు ఎస్‌ఐ శివప్రసాద్‌ పరిశీలించారు. ఐదుగురు చిన్నారులు మృతి చెందడంపై మాజీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఏలూరులో ముగ్గురు మృతి

ఏలూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భీమడోలు సమీపంలోని చెరువులో ప్రమాదవశాత్తు పడి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరో ఇద్దరు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. మూడు మృతదేహాలను వెలికితీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. మూడు మృతదేహాలను వెలికితీశారు. ముగ్గురు చిన్నారుల మరణంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Tags

Next Story