TS: చింతలమడ రోడ్డు ప్రమాద బాధితులకు మండలి బుద్ధప్రసాద్‌ అండ

TS: చింతలమడ రోడ్డు ప్రమాద బాధితులకు మండలి బుద్ధప్రసాద్‌ అండ
బాధితులకు వైఎస్సార్‌ బీమా, భర్తలను కోల్పోయినవారికి వితంతు పించన్‌, అందించకపోవడంతో టీడీపీ శ్రేణులు, దళిత సంఘాల సత్యాదీక్ష

చింతలమడ రోడ్డు ప్రమాద బాధితలుకు మండలి బుద్ధప్రసాద్‌ అండగా నిలిచారు. అవనిగడ్డ నియోజకవర్గంలో గత ఏడాది చల్లపల్లి దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 5గురు మృతి చెందగా,18మందికి గాయాలయ్యాయి. అయితే ఇంతవరకు బాధితులకు వైఎస్సార్‌ బీమా కానీ భర్తలను కోల్పోయిన మహిళలకు వితంతు పించన్‌ కానీ అందించకపోవడానికి నిరసనగా టీడీపీ శ్రేణులు, దళిత సంఘాల ఆధ్వర్యంలో సత్యాదీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి మాజీ ఉప సభాపతి మద్దతు తెలిపారు. ప్రమాదం జరిగి సంవత్సరం కావొస్తున్నా ఇంతవరకు ప్రభుత్వం తరుపున ఎలాంటి న్యాయం జరగలేదని బాధితులు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో దళిత సంఘాలు పాల్గొన్నాయి. దీక్షకు వామపక్షాలు,జనసేన మద్దతు తెలిపాయి.

Tags

Next Story