విజయనగరం జిల్లాలో 20మంది విద్యార్ధులకు కరోనా పాజిటివ్
![విజయనగరం జిల్లాలో 20మంది విద్యార్ధులకు కరోనా పాజిటివ్ విజయనగరం జిల్లాలో 20మంది విద్యార్ధులకు కరోనా పాజిటివ్](https://www.tv5news.in/h-upload/2020/10/03/272371-corona-virus-final.webp)
* గంట్యాడ పాఠశాలలో కరోనాబారిన పడిన విద్యార్ధులు
* గంట్యాడ ప్రభుత్వ ఆస్పత్రిలో విద్యార్ధులకు పరీక్షలు
* 20 మంది విద్యార్థులకు పాజిటివ్ వచ్చినట్లు తెలిపిన వైద్యులు
* డీఈవోకు లేఖ రాసిన ప్రధానోపాధ్యాయుడు
* ఆందోళనలో విద్యార్ధులు, తల్లిదండ్రులు
విజయనగరం జిల్లాలో 20మంది విద్యార్ధులకు కరోనా సోకింది. గత నెల 30వ తేదీన 9,10 తరగతి విద్యార్ధులకు గంట్యాడ ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా పరీక్షలు చేయించడంతో.... వారిలో 20మందికి కరోనా సోకినట్లు తేలింది. విద్యార్ధులకు పాజిటివ్ వచ్చినట్లు గంట్యాడ జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డీఈవోకు లేఖ రాశారు. 20 మందికి కరోనా సోకడంతో అటు విద్యార్ధులు, ఇటు తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తల్లిదండ్రుల అనుమతితోనే ఇక్కడ గత కొద్ది రోజులుగా తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com