US: అమెరికా నుంచి విద్యార్థిని మృతదేహం తెచ్చేందుకు విరాళాలు

US: అమెరికా నుంచి విద్యార్థిని మృతదేహం తెచ్చేందుకు విరాళాలు
X
నిధులు సేకరిస్తున్న భారత కమ్యూనిటీ

అమె­రి­కా­లో ఉన్నత చదు­వు­లు చది­వేం­దు­కు వె­ళ్లిన మరో తె­లు­గు వి­ద్యా­ర్థి ప్రా­ణం పో­యిం­ది. బా­ప­ట్ల జి­ల్లా కా­రం­చే­డు­కు చెం­దిన రా­జ్య­ల­క్ష్మి అనే వి­ద్యా­ర్థి అనా­రో­గ్యం కా­ర­ణం­గా చని­పో­యిం­ది. ఇటీ­వ­లే ఎం­ఎ­స్ పూ­ర్తి చే­సిన రా­జ్య­ల­క్ష్మి.. ప్ర­స్తు­తం ఉద్యోగ ప్ర­య­త్నా­ల­లో ఉంది. అయి­తే ఇటీ­వ­లే కు­టుం­స­భ్యు­ల­తో మా­ట్లా­డిన ఆమె.. జలు­బు, ఆయా­సం­గా ఉం­ద­ని చె­ప్పిం­ది. డా­క్ట­ర్ వద్ద­కు వె­ళ్ల­డా­ని­కి అపా­యిం­ట్‌­మెం­ట్ కూడా తీ­సు­కుం­ది. అయి­తే ఈలో­పే చని­పో­యి­న­ట్లు ఆమె స్నే­హి­తు­లు తె­లి­పా­రు. మూడు రో­జుల కిం­దట తనకు జలు­బు, ఆయా­సం­గా ఉం­ద­ని కు­టుం­బ­స­భ్యు­ల­కు తె­లి­పిం­ది రా­జ్య­ల­క్ష్మి. చి­కి­త్స కోసం తొ­మ్మి­దవ తేదీ డా­క్ట­ర్ అపా­యిం­ట్‌­మెం­ట్ తీ­సు­కు­న్నా­న­ని గు­రు­వా­రం రా­త్రి కు­టుం­బ­స­భ్యు­ల­కు ఫో­న్‌­లో చె­ప్పిం­ది. ఆ తర్వాత స్నే­హి­తు­ల­తో కలి­సి ని­ద్ర­పో­యిం­ది. అయి­తే మరు­స­టి రోజు ఉదయం రా­జ్య­ల­క్ష్మి ని­ద్ర­లే­వ­లే­దు. తాము ని­ద్ర లే­ప­టా­ని­కి ప్ర­య­త్ని­స్తే ఎలాం­టి స్పం­దన లే­ద­ని.. దీం­తో వెం­ట­నే ఆస్ప­త్రి­కి తీ­సు­కె­ళ్తే ఆమె చని­పో­యి­న­ట్లు వై­ద్యు­లు చె­ప్పా­ర­ని ఆమె స్నే­హి­తు­లు చె­ప్తు­న్నా­రు. రా­జ్య­ల­క్ష్మి మర­ణ­వా­ర్త విని ఆమె కు­టుం­బ­స­భ్యు­లు గుం­డె­లు పగి­లే­లా రో­ది­స్తు­న్నా­రు.

నిధులు సేకరిస్తున్న భారత కమ్యూనిటీ

కు­టుం­బం తీ­వ్ర ఆర్థిక సమ­స్య­ల్లో ఉన్నం­దు­వ­ల్ల రా­జ్య­ల­క్ష్మి మృ­త­దే­హా­న్ని భా­ర­త్‌­కు తీ­సు­కు­రా­వ­డా­ని­కి యూ­ఎ­స్‌­లో­ని భారత కమ్యూ­ని­టీ ని­ధు­లు సే­క­రి­స్తు­న్న­ట్లు మృ­తు­రా­లి బం­ధు­వు చై­త­న్య పే­ర్కొ­న్నా­రు. అం­త్య­క్రి­యల ఖర్చు­ల­కు, వి­ద్యా రు­ణా­ల­ను తి­రి­గి చె­ల్లిం­చ­డా­ని­కి, రా­జ్య­ల­క్ష్మి తల్లి­దం­డ్రు­ల­కు కొం­త­మేర ఆర్థిక సహా­యం అం­దిం­చ­డా­ని­కి గో­ఫం­డ్‌­మీ సం­స్థ సా­యం­తో భారత కమ్యూ­ని­టీ ని­ధు­లు సే­క­రి­స్తు­న్న­ట్లు తె­లి­పా­రు. కృ­ష్ణా జి­ల్లా­లో­ని గు­డ్ల­వ­ల్లే­రు కళా­శా­ల­లో ఇం­జి­నీ­రిం­గ్‌ పూ­ర్తి చే­సిన రా­జ్య­ల­క్ష్మి ఉన్నత చదు­వుల కోసం అమె­రి­కా­లో­ని టె­క్సా­స్‌­లో గల యూ­ని­వ­ర్సి­టీ ఆఫ్‌ న్యూ­హె­వ­న్‌­లో ఎం­ఎ­స్‌ కం­ప్యూ­ట­ర్స్‌ వి­భా­గం­లో 2023లో చే­రా­రు. ఇటీ­వల వి­ద్యా­భ్యా­సం ము­గి­య­డం­తో అక్క­డే స్నే­హి­తు­ల­తో కలి­సి ఉద్యోగ ప్ర­య­త్నం­లో ఉన్నా­రు. రాజ్యలక్ష్మి మృతిపై ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు విచారం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

Tags

Next Story