VICE PRESIDENT: మరోసారి ఉప రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు!

VICE PRESIDENT: మరోసారి ఉప రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు!
X
నేడే ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఖరారు... ఇవాళే బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ... అభ్యర్థి ఎంపికపై జోరుగా ఊహాగానాలు ##

పా­ర్ల­మెం­ట్ వర్షా­కాల సమా­వే­శా­ల్లో చో­టు­చే­సు­కు­న్న అనూ­హ్య పరి­ణా­మం­తో దే­శం­లో ఒక్క­సా­రి­గా రా­జ­కీయ వా­తా­వ­ర­ణం మా­రి­పో­యిం­ది. ఉప­రా­ష్ట్ర­ప­తి పద­వి­కి జగ్‌­దీ­ప్ ధన్క­డ్ రా­జీ­నా­మా దే­శం­లో సరి­కొ­త్త చర్చ­కు దా­రి­తీ­సిం­ది. ఈలో­గా ఉప­రా­ష్ట్ర­ప­తి ఎన్ని­క­కు కేం­ద్ర ఎన్ని­కల సంఘం తే­దీ­లు ఖరా­రు చే­య­డం­తో భారత చరి­త్ర­లో ఇది రెం­డో మధ్యం­తర ఉప­రా­ష్ట్ర­ప­తి ఎన్ని­క­గా ని­లు­స్తుం­ది. సె­ప్టెం­బ­ర్ 9న జరి­గే ఉప­రా­ష్ట్ర­ప­తి ఎన్ని­క­కు ఎన్డీఏ తర­ఫున అభ్య­ర్థి­ని ఖరా­రు చే­య­డా­ని­కి రంగం సి­ద్ద­మైం­ది. ఈ నే­ప­థ్యం­లో బీ­జే­పీ పా­ర్టీ ప్ర­ధాన కా­ర్యా­ల­యం­లో ఆ పా­ర్టీ పా­ర్ల­మెం­ట­రీ బో­ర్డు సభ్యు­లు ఇవాళ సా­యం­త్రం 6 గం­ట­ల­కు కీలక సమా­వే­శా­ని­కి హా­జ­రు­కా­ను­న్నా­రు. ఈ సమా­వే­శం­లో ప్ర­ధాన మం­త్రి నరేం­ద్ర మోదీ, కేం­ద్ర హోం మం­త్రి అమి­త్ షా, రక్షణ మం­త్రి రా­జ్‌­నా­థ్ సిం­గ్, బీ­జే­పీ చీఫ్ జగత్ ప్ర­కా­శ్ నడ్డా పా­ల్గొ­ని అభ్య­ర్థి­ని ని­ర్ణ­యిం­చ­ను­న్నా­రు. ఈ సమా­వే­శం కూ­ట­మి భా­గ­స్వా­ముల నుం­డి ఏకా­భి­ప్రా­యం­తో ఓ అభ్య­ర్థి ఎం­పిక చే­యా­ల­ని భా­వి­స్తు­న్న­ట్టు అం­చ­నా వ్య­క్త­మ­వు­తోం­ది.

ఇప్పటికే పూర్తయిన చర్చలు

బీ­జే­పీ అగ్ర నే­త­లు అమి­త్ షా, రా­జ్‌­నా­థ్ సిం­గ్, ఇతర కేం­ద్ర మం­త్రు­లు జెపీ నడ్డా­తో కలి­సి ఉప­రా­ష్ట్ర­ప­తి అభ్య­ర్థి ఎం­పి­క­పై ఇప్ప­టి­కే వి­స్తృత చర్చ­లు జరి­పా­రు. ఈ నే­ప­థ్యం­లో కొ­న్ని పే­ర్లు పరి­శీ­ల­న­లో ఉన్నా­యి, వా­టి­లో ఒక­రి­ని ఫై­న­ల్ చే­య­డా­ని­కి ఇవాళ సమా­వే­శం ని­ర్వ­హిం­చ­ను­న్నా­రు. ఈ అభ్య­ర్థుల రే­సు­లో ము­ఖ్యం­గా మాజీ ఉప­రా­ష్ట్ర­ప­తి వెం­క­య్య నా­యు­డు, ఆర్‌­ఎ­స్‌­ఎ­స్ సి­ద్ధాం­త­క­ర్త, బి­జె­పి సీ­ని­య­ర్ సభ్యు­డు శే­షా­ద్రి చారి పే­ర్లు ప్ర­ధా­నం­గా వి­ని­పి­స్తు­న్నా­యి. అలా­గే.. ప్ర­స్తుత, మాజీ గవ­ర్న­ర్లు కూడా రే­సు­లో ఉన్న­ట్లు తె­లు­స్తోం­ది. ఇక NDA పా­లిత రా­ష్ట్రాల ము­ఖ్య­మం­త్రు­లు, ఉప ము­ఖ్య­మం­త్రు­లు ఆగ­స్టు 21న కూ­ట­మి ఉప­రా­ష్ట్ర­ప­తి అభ్య­ర్థి నా­మి­నే­ష­న్ పత్రాల దా­ఖ­లు చే­య­ను­న్న­ట్టు తె­లు­స్తోం­ది. అదే­వి­ధం­గా, ఆగ­స్టు 20న NDA విం­దు జరి­గే అవ­కా­శం ఉం­ద­ని, ఆ సమ­యం­లో అభ్య­ర్థి పే­రు­పై ఏకా­భి­ప్రా­యం­తో అధి­కా­రి­కం­గా ప్ర­క­టి­స్తా­ర­ని వర్గా­లు తె­లి­పా­యి. ఉప­రా­ష్ట్ర­ప­తి ఎన్ని­కల ఓటిం­గ్ వి­ధా­నా­ల­పై బి­జె­పి ప్ర­ధాన కా­ర్యా­ల­యం­లో ని­ర్వ­హిం­చ­ను­న్న వర్క్‌­షా­ప్‌­లో పా­ల్గొ­న­డా­ని­కి సె­ప్టెం­బ­ర్ 6 నుం­చి 9 మధ్య రా­జ్య­సభ, లో­క్‌­సభ ఎం­పీ­ల­ను ఢి­ల్లీ­లో ఉం­డ­మ­ని పా­ర్టీ కో­రిం­ది.

వెంకయ్యకే అవకాశం

మాజీ ఉప రా­ష్ట్ర­ప­తి వెం­క­య్య­నా­యు­డి­ని మరో­సా­రి ఉప­రా­ష్ట్ర­ప­తి పదవి వరిం­చే అవ­కా­శా­లు ఉన్నా­య­ని ఢి­ల్లీ వర్గా­ల్లో జో­రు­గా ప్ర­చా­రం సా­గు­తోం­ది. జగ­దీ­ప్‌ ధన్‌­ఖ­డ్‌ రా­జీ­నా­మా­తో ఖాళీ అయిన స్థా­నం­లో వెం­క­య్య­ను ని­య­మిం­చా­ల­ని బీ­జే­పీ భా­వి­స్తోం­ద­ని అం­టు­న్నా­రు. ఈ మే­ర­కు ఎన్డీఏ పక్షా­ల­తో చర్చిం­చి­న­ట్టు సమా­చా­రం అం­దు­కోం­ది. ఈ వి­ష­యం­పై వెం­క­య్య అభి­ప్రా­యం కూడా తీ­సు­కు­న్నా­ర­ని బీ­జే­పీ వర్గా­లు చె­బు­తు­న్నా­యి. మొ­న్న­టి వరకు ఉప­రా­ష్ట్ర­ప­తి­గా ఉన్న జగ­దీ­ప్‌ ధన్‌­ఖ­డ్‌ ఆరో­గ్య కా­ర­ణా­ల­తో అక­స్మా­త్తు­గా రా­జీ­నా­మా చే­శా­రు. ఈ రా­జీ­నా­మా­తో ఖాళీ పో­స్టు­లో ఎవ­ర్ని ని­య­మిం­చా­ల­నే చర్చ తీ­వ్రం­గా సా­గు­తోం­ది. వచ్చే ఏడా­ది రెం­డు మూడు రా­ష్ట్రా­ల్లో ఎన్ని­క­లు ఉన్నా­యి. వా­టి­ని దృ­ష్టి­లో పె­ట్టు­కొ­ని ఈ ని­యా­మ­కం జర­గు­తుం­ద­ని రా­జ­కీయ వి­శ్లే­ష­కు­లు భా­వి­స్తు­న్నా­రు. కానీ బీ­జే­పీ మా­త్రం అనూ­హ్యం­గా వెం­క­య్య పే­రు­ను తె­ర­పై­కి తీ­సు­కొ­చ్చి­న­ట్లు­గా తె­లు­స్తోం­ది. వెం­క­య్య­నా­యు­డు­కు రా­జ్యాం­గం­ప­ట్ల, రా­జ్య­సభ ని­ర్వ­హణ పట్ల పట్టు ఉంది. ఆయన ఉప­రా­ష్ట్ర­ప­తి­గా ఉన్న ఐదు సం­వ­త్స­రాల కోసం భా­ర­తీయ జనతా పా­ర్టీ­కి ఎలాం­టి సమ­స్య­లు రా­లే­దు. అదే సమ­యం­లో.. ఆయన పని­తీ­రు అం­ద­రి ప్ర­శం­స­లు అం­దు­కుం­ది. బీ­జే­పీ వెం­క­య్య పే­రు­ను పరి­శీ­లిం­చ­డా­ని­కి ఇది కూడా ఓ కా­ర­ణం అన్న ప్ర­చా­రం జరు­గు­తోం­ది.

Tags

Next Story