VINAYKA CHATURDHI: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వినాయక చవితి

VINAYKA CHATURDHI: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వినాయక చవితి
X
వాడవాడల వెలిసిన గణనాథుడు... సర్వాంగ సుందరంగా ముస్తాబైన వినాయక మండపాలు

నేడే వినాయక చవితి. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి జన్మదినమే వినాయక చవితి. భాద్రపద మాసం శుక్లపక్ష చవితి రోజున దేశవ్యాప్తంగా ఈ పండగను ప్రజలు జరుపుకొంటారు. ఉదయం నిద్ర లేచి, స్నానం చేసి మడి కట్టుకుని ఇంటిలోని గుడిని శుభ్రం చేసుకోవాలి. చవితి రోజు ఉపవాసం ఉంటే కుటుంబంలో సంతోషం కూడా పెరుగుతుంది. వినాయకునికి ఇష్టమైన మోదకాలు, ఉండ్రాళ్ళు వంటివి నైవేద్యంగా సమర్పించాలి. హిందువులకు ఎంతో ప్రాముఖ్యత కలిగిన పండగల్లో వినాయక చవితి ఒకటి. చవితి రోజున ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలని పండితులు చెబుతున్నారు. ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 5 జిల్లేడు ఒత్తులు విడిగా వేసి దీపం వెలిగిస్తే గణనాథుడి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. అలాగే, ఎరుపు/ నీలం రంగు వస్త్రాలు ధరించాలంటున్నారు. 21 పత్రాలతో పూజించడం వీలుకాని వారు గరిక పోచల జంటను వినాయకుడికి సమర్పిస్తే మంచి ఫలితం ఉంటుంది.


చేయాల్సిన పనులివే!

విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి జన్మదినమే వినాయక చవితి. ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్ష చవితి రోజున దేశవ్యాప్తంగా ఈ పండగను ప్రజలు జరుపుకొంటారు. ఈరోజు ఉదయం నిద్ర లేచి, స్నానం చేసి మడి కట్టుకుని ఇంటిలోని గుడిని శుభ్రం చేసుకోవాలి. చవితి రోజు ఉపవాసం ఉంటే కుటుంబంలో సంతోషం కూడా పెరుగుతుంది. వినాయకునికి ఇష్టమైన మోదకాలు, ఉండ్రాళ్ళు వంటివి నైవేద్యంగా సమర్పించాలి.తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రతీ వీధిలోనూ గణనాథుడిని కొలువుదీరుస్తున్నారు. వినాయక మండపాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, సినీ ప్రముఖులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

గణపతి పూజలో ‘గరిక’కు ప్రాధాన్యం.

వినాయక చవితి పూజలో ఎన్ని రకాల పుష్పాలు వాడినా పత్రిలో గరిక కచ్చితంగా ఉండాలని పూజారులు చెబుతున్నారు. పూర్వం అనలాసురుడు అనే రాక్షసుడు విపరీతమైన వేడి పుట్టించి దేవతల్ని ఇబ్బందులకు గురిచేశాడట. ఆ రాక్షసుడిని గణేశుడు మింగేయడంతో ఆయన శరీరం వేడిగా మారిందట. దీంతో రుషుల సూచనతో 21 గరికపోచలను స్వామి తలపై పెట్టగా, వేడి తగ్గిపోయిందట. అందుకే పూజలో గరికకు ప్రాధాన్యం దక్కినట్లు చెబుతారు.

Tags

Next Story