crime: ఆరుగురిని చంపిన అప్పలరాజుకు మరణశిక్ష

ఆరుగురిని నరికి చంపిన అప్పలరాజుకు విశాఖ న్యాయస్థానం మరణశిక్ష విధించింది. 2021 ఏప్రిల్ 15న విశాఖ జిల్లా పెందుర్తి మండలం జుత్తాడలో చిన్నారి సహా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని అప్పలరాజు హతమార్చాడు. జుత్తాడలోని బత్తిన, బొమ్మిడి కుటుంబాల మధ్య వివాదాలున్నాయి. ఈ క్రమంలో బొమ్మిడి కుటుంబం ఇంట్లోకి చొరబడిన అప్పలరాజు ఆరుగురిపై కత్తితో దాడి చేశారు. దొరికిన వారిని దొరికినట్టు నరికిపారేశాడు.ఈ కేసులో నేర నిరూపణ కావడంతో అప్పలరాజుకు ఉరిశిక్ష విధించారు. కుటుంబ పెద్ద అయిన బమ్మిడి రమణ , ఆ కుటుంబంలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పిల్లల్ని చంపేశాడు. పిల్లలలో ఐదు నెలల పసిపాప కూడా ఉంది. గడ్డి కోసే రెండు పదునైన కొడవలితో హత్య చేశాడు. ఈ కేసులో అప్పలరాజుకు కోర్టు ఉరి శిక్ష విధించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com