VIVEKA: వివేకా... న్యాయం జరగదా ఇక

VIVEKA: వివేకా... న్యాయం జరగదా ఇక
X
ఆరేళ్లుగా సాగుతోన్న వివేకా హత్య కేసు... ఇప్పటికీ దర్యాప్తు పూర్తి చేయని సీబీఐ... దర్యాప్తు కీలక దశలో చేతులెత్తేసిన సీబీఐ

“ చి­న్న క్లూ­తో హత్య­నే­రం చే­ధిం­చిన పో­లీ­సు­లు” ఆరే­ళ్ల కా­లం­లో ఇలాం­టి వా­ర్త­లు మీరు ఎన్ని చది­వి ఉం­టా­రో. కానీ అన్ని ఆధా­రా­లు కళ్ల ముం­దు ఉన్నా వి­వే­కా హత్య కేసు మా­త్రం ఇంకా తే­ల­డం లేదు. అన్ని ఆధా­రా­లు కళ్ల ముం­దే ఉన్నా­యి. కానీ పో­లీ­సు­లు మా­త్రం కే­సు­ను చే­ధిం­చ­లే­క­పో­యా­రు. వి­వే­కా హత్య కే­సు­లో అన్ని వే­ళ్లూ జగ­న్‌, భా­ర­తి వైపే చూ­పు­తు­న్నా వా­రి­ని సీ­బీఐ ఎం­దు­కు వి­చా­రిం­చ­లే­ద­న్న­ది అం­తు­చి­క్క­ని ప్ర­శ్న­గా మి­గి­లి­పో­యిం­ది. హత్య సమా­చా­రం బయ­ట­కు రాక ముం­దే వా­రి­కె­లా తె­లు­స­న్న వి­ష­యం­పై వా­రి­ని సీ­బీఐ ఒక్క­సా­రై­నా ప్ర­శ్నిం­చ­లే­దు. అవి­నా­ష్‌­రె­డ్డి వి­వే­కా హత్య­కు ముం­దు, తర్వాత వా­ట్సా­ప్‌­లో ఎవ­రి­తో కా­ల్స్‌, చా­ట్స్‌ చే­శా­ర­న్న వి­ష­యం­పై ఎం­దు­కు దర్యా­ప్తు చే­య­లే­దో సీ­బీ­ఐ­కే తె­లి­యా­లి. ప్ర­ధాన కు­ట్ర­దా­రు­లె­వ­రో వె­లి­కి­తీ­సే స్థా­యి­కి చే­రిన దర్యా­ప్తు­ను సీ­బీఐ కీలక దశలో ఆపే­సిం­ది. రెం­డే­ళ్లు­గా అధి­కా­రు­లు ఈ కేసు ఊసే ఎత్త­క­పో­వ­డం­పై అనేక అను­మా­నా­లు వ్య­క్త­మ­వు­తు­న్నా­యి.

రెండేళ్లుగా అస్సలు ఊసే లేదు

వివేకా హత్య వెనుక ఉన్న విస్తృత కుట్ర కోణాన్ని వెలికితీసే దశలో దర్యాప్తు కొనసాగించాల్సి ఉందంటూ కోర్టుల్లో చెప్పిన సీబీఐ రెండేళ్లుగా కేసు ఊసే ఎత్తట్లేదు. 2023 జూన్‌ 30న రెండో అనుబంధ అభియోగపత్రం దాఖలు చేశాక దర్యాప్తును నిలిపేసింది. ప్రధాన కుట్రదారులెవరో వెలికితీసే స్థాయికి దర్యాప్తును తీసుకొచ్చి అసలు అంశాల్ని ఛేదించకుండా వదిలేసింది. వివేకా హత్య కేసులో అన్ని వేళ్లూ జగన్‌, ఆయన సతీమణి భారతి వైపే చూపిస్తున్నా వారిని సీబీఐ ఒక్కసారి కూడా ప్రశ్నించలేదు. విచారణకు పిలుస్తూ నోటీసులైనా ఇవ్వలేదు.

సాక్ష్యుల వరుస మరణాలు

వివేకా హత్య కేసు దర్యాఫ్తు జరుగుతుండగా కీలక సాక్షులు, కేసుకు సంబంధం ఉన్న వ్యక్తులు అనుమానాస్పదరీతిలో చనిపోవడం మరో సంచలనంగా మారింది. వివేకానందరెడ్డి 2019 లో చనిపోగా అప్పటి నుంచి 2024 వరకు ఈ కేసుకు సంబంధించిన నలుగురు వ్యక్తులు వివిధ కారణాలతో చనిపోయారు. వివేకా నివాసంలో వాచ్ మన్ గా పనిచేసిన రంగన్న కూడా అనుమానాస్పదరీతిలో చనిపోయారు. రం­గ­న్న మర­ణం­పై ఆయన కు­మా­రు­డు కాం­తా­రా­వు సం­దే­హా­లు వ్య­క్తం చే­స్తూ పో­లీ­సు­ల­కు ఫి­ర్యా­దు చే­శా­రు. ఇవి సహజ మరణాలేనని, అనారోగ్య కారణాలతో చనిపోయారని చెబుతున్నప్పటికీ, లోతుగా చూస్తే అనుమానాస్పదంగానే కనిపిస్తున్నాయి. ఇవన్నీ కేసుపై ప్రభావం చూపేవే అయినా సీబీఐ పట్టించుకోవట్లేదు. అవినాష్‌రెడ్డి ప్రస్తుతం ముందస్తు బెయిల్‌పై ఉన్నారు. అత్యంత పలుకుబడి కలిగిన ఆయన సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నట్లు, బెదిరిస్తున్నట్లు ఇప్పటికే సీబీఐకీ ఆధారాలతో అనేక ఫిర్యాదులు అందాయి. అయినా ఆయన ముందస్తు బెయిల్‌ రద్దు కోరుతూ సీబీఐ పిటిషన్ వేయట్లేదు.

Tags

Next Story