VIVEKA CASE: ఆరేళ్లుగా న్యాయం కోసం తిరుగుతున్నా

VIVEKA CASE: ఆరేళ్లుగా న్యాయం కోసం తిరుగుతున్నా
X
వైఎస్ వివేకా కుమార్తె సునీత కీలక వ్యాఖ్యలు.. సాక్ష్యులను బెదిరిస్తున్నారు

వి­వేక హత్య కే­సు­లో సా­క్షు­ల­ను బె­ది­రి­స్తు­న్నా­ర­ని వై­ఎ­స్ వి­వే­కా కు­మా­ర్తె వై­ఎ­స్ సు­నీత సం­చ­లన వ్యా­ఖ్య­లు చే­సా­రు. తాను కూడా ఒక సా­క్షి­నే అని.. తన­పైన తన భర్త పైన మేమే వి­వే­కా­ను చం­పిం­చా­మ­ని కే­సు­లు పె­డు­తు­న్నా­ర­ని ఆవే­దన వ్య­క్తం చే­శా­రు. కడప ఎస్పీ ని కలి­సిన సు­నీత.. వి­వే­కా హత్య కే­సు­పై చర్చిం­చా­రు. బె­ది­రిం­పు­ల­కు పా­ల్ప­డు­తు­న్న వా­రి­పై యా­క్ష­న్ తీ­సు­కో­వా­ల­ని పో­లీ­సు­లు కో­రా­మ­ని తె­లి­పా­రు. తప్పు ఎవరు చే­సి­నా శి­క్ష పడా­ల్సిం­దే అన్నా­రు. వి­వేక హత్య కేసు తాజా పరి­ణా­మా­ల­ను ఎస్పీ­కి వి­వ­రిం­చా­రు. సు­ప్రీం లో నిం­ది­తుల బె­యి­ల్ రద్దు పి­టి­ష­న్ దృ­ష్ట్యా ఎస్పీ­ని కలి­సి­న­ట్లు తె­లి­పా­రు. రెం­డు రో­జు­లు­గా పు­లి­వెం­దు­ల­లో ఘట­న­లు చూ­స్తే నా­న్న హత్య గు­ర్తొ­స్తోం­ది అన్నా­రు. గొ­డ్డ­లి పో­టు­తో వి­వే­క­ప­డి ఉంటే గుం­డె­పో­టు అని చె­ప్పా­రు. పో­లీ­సు­ల­ను బె­ది­రిం­చి క్రై­మ్ సీను తు­డి­చే­శా­ర­ని ఆరో­పిం­చా­రు. హత్య తర్వాత లె­ట­ర్ తె­చ్చి ము­గ్గు­రు చం­పి­న­ట్లు సం­త­కం పె­ట్ట­మం­టే నేను పె­ట్ట­లే­దు అన్నా­రు. ‘‘జడ్పీ­టీ­సీ ఉప ఎన్నిక సం­ద­ర్భం­గా రెం­డు రో­జు­లు­గా పు­లి­వెం­దు­ల­లో జరు­గు­తు­న్న ఘట­న­లు చూ­స్తుం­టే మా నా­న్న వి­వే­కా హత్య గు­ర్తొ­స్తోం­ది. గొ­డ్డ­లి­పో­టు­తో వి­వే­కా పడి ఉంటే అప్పు­డు గుం­డె­పో­టు అని చె­ప్పా­రు." అని సు­నీత అన్నా­రు .

లేఖపై సంతకం పెట్టమన్నారు

ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బీటెక్ రవి చంపినట్లు సంతకం పెట్టమన్నారని తెలిపారు. అవినాష్ రెడ్డి అనుచరులు పోలీసులను బెదిరించారని ఆరోపించారు. ప్రస్తుతం ఎన్నికల్లో కూడా ఇదే జరుగుతుందన్నారు. గతంలో టిడిపి నేతలు చంపారని నమ్మబలికారు అని తెలిపారు. మా బంధువు సురేష్ పై అవినాష్ అనుచరులు దాడి చేయించారని అనుమానంగా ఉందన్నారు. ఆరేళ్లుగా వివేక హత్య కేసు పై పోరాడుతూనే ఉన్నానని తెలిపారు. ఇప్పటివరకు హత్య కేసు దోషులకు శిక్ష పడలేదన్నారు. వివేకాను నేను నా భర్త చంపించామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాన్న మళ్ళీ తిరిగి రాడు తప్పు చేసిన వారికి శిక్ష పడాలని ఆమె అన్నారు. వివేక హత్య కేసును నిందితులు బయట తిరు గుతున్నారని సునీత అన్నారు. రేపు వివేక పుట్టినరోజు పులివెందుల వెళ్లొద్దని నా తల్లి చెబుతుందని తెలిపారు. న్యాయం కోసం పోరాడడానికి సెక్యూరిటీని పెట్టుకుని తిరగాల్సి వస్తుంది అన్నారు. కచ్చితంగా న్యాయమే గెలుస్తుందని ఆమె అ న్నారు. బెదిరిస్తే భయపడే పరిస్థితి లేదని తెలిపారు. వివేక హత్య కేసు నిందితులు సాక్షులను బెదిరిస్తున్న దిక్కు లేదని తెలిపారు.

Tags

Next Story