Viveka Murder Case : 19న విచారణకు రావాల్సిందే

Viveka Murder Case :  19న విచారణకు రావాల్సిందే

వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి లేఖపై సీబీఐ స్పందించింది. ఈనెల 19న విచారణకు రావాలని మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇవాళ సీబీఐ విచారణకు అవినాష్‌రెడ్డి డుమ్మా కొట్టారు. హైదరాబాద్‌ నుంచి నేరుగా పులివెందుల వెళ్లిపోయారు. ముందస్తుగా ఫిక్స్‌ చేసుకున్న పనులు ఉన్నందున.. నాలుగు రోజుల సమయం కావాలంటూ సీబీఐని కోరారు. ఆయన విజ్ఞప్తిపై స్పందించిన అధికారులు.. ఈనెల 19న విచారణకు రావాలంటూ వాట్సాప్‌లో నోటీసులు పంపించారు. హైదరాబాద్‌లోని సీబీఐ ఆఫీస్‌లో విచారణకు రావాలని నోటీసులో పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story