Viveka Murder Case: దస్తగిరి సంచలన వ్యాఖ్యలు.. నాకు ప్రాణహాని ఉంది

Viveka Murder Case: దస్తగిరి సంచలన వ్యాఖ్యలు.. నాకు ప్రాణహాని ఉంది
సీఎం జగన్, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆందోళన

వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన డ్రైవరు దస్తగిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వివేకా హత్యకు సాయం చేసి తప్పు చేశానని, ప్రాయశ్చిత్తానికి సిద్ధపడ్డానని పేర్కొన్నారు.‘ తాను అప్రూవర్‌గా మారడాన్ని అనేక మంది విమర్శిస్తున్నారని.... అప్రూవర్‌గా మారేటప్పుడు ఎంపీ అవినాష్‌రెడ్డి లాంటివాళ్లు ఎందుకు ప్రశ్నించలేదన్నారు. అవినాష్‌రెడ్డి పాత్ర ఉంది కాబట్టే సీబీఐ అధికారులు విచారణకు పిలుస్తున్నారు. సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌ను పలుకుబడి ఉందని మార్చేశారని ఆయన్ను మార్చితే కొత్త బృందం.. కొత్త కోణంలో విచారిస్తుందా? అని ప్రశ్నించారు.

Tags

Read MoreRead Less
Next Story