VIZAG: విశాఖలో డిసెంబర్ 12 నుంచి " కాగ్నిజెంట్" కార్యకలాపాలు

VIZAG: విశాఖలో డిసెంబర్ 12 నుంచి  కాగ్నిజెంట్ కార్యకలాపాలు
X
ఐటీ కేంద్రంగా మారుతున్న విశాఖ

సాగర తీరం వి­శా­ఖ­ప­ట్నా­న్ని ఐటీ హబ్‌­గా తీ­ర్చి­ది­ద్దా­ల­నే ఏపీ ప్ర­భు­త్వం ఉద్దే­శా­ని­కి అను­గు­ణం­గా వే­గం­గా అడు­గు­లు పడు­తు­న్నా­యి. వి­శా­ఖ­లో పె­ట్టు­బ­డు­లు పె­ట్టేం­దు­కు పలు ఐటీ సం­స్థ­లు ముం­దు­కు వచ్చిన సం­గ­తి తె­లి­సిం­దే. గూ­గు­ల్, యా­క్సెం­చ­ర్, టీ­సీ­ఎ­స్, కా­గ్ని­జెం­ట్ వంటి అం­త­ర్జా­తీయ సం­స్థ­లు కూడా ముం­దు­కు వచ్చా­యి. ఈ క్ర­మం­లో­నే వి­శా­ఖ­ప­ట్నం­లో కా­గ్ని­జెం­ట్ క్యాం­ప­స్ గు­రిం­చి కీలక అప్ డేట్ వచ్చిం­ది. డి­సెం­బ­ర్ 12 నుం­చి వి­శా­ఖ­లో కా­గ్ని­జెం­ట్ సం­స్థ కా­ర్య­క­లా­పా­లు ప్రా­రం­భిం­చ­ను­న్న­ట్లు సమా­చా­రం. తా­త్కా­లిక భవనం నుం­చి కా­ర్య­క్ర­మా­లు ప్రా­రం­భిం­చ­ను­న్న­ట్లు తె­లి­సిం­ది. మధు­ర­వాడ ఐటీ జో­న్‌‍లో 800 సీ­ట్ల సా­మ­ర్థ్యం ఉన్న తా­త్కా­లిక భవ­నం­లో ప్ల­గ్ అండ్ ప్లే వి­ధా­నం­లో కా­గ్ని­జెం­ట్ తన కా­ర్య­క­లా­పా­లు మొ­ద­లు­పె­ట్ట­నుం­ది. మధు­ర­వాడ ఐటీ జోన్, హిల్ నం­బ­ర్ 2లోని మహతి బి­ల్డిం­గ్ ఇం­దు­కు కే­టా­యిం­చా­రు. వి­శా­ఖ­లో కా­గ్ని­జెం­ట్ క్యాం­ప­స్ పూ­ర్తి స్థా­యి­లో అం­దు­బా­టు­లో­కి వచ్చే వరకూ ఈ భవనం నుం­చి కా­ర్య­క­లా­పా­లు సా­గి­స్తా­రు.

డేటా క్యాపిటల్ ఆఫ్ ఇండియా

‘డేటా క్యాపిటల్ ఆఫ్ ఇండియా’గా అవతరిస్తోందని ఏపీ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. విశాఖపట్నంలో రిలయన్స్-జేవీ డిజిటల్ కనెక్షన్ సంస్థ రూ.98వేల కోట్లు పెట్టుబడి పెట్టనుందని ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు. దీని ద్వారా ఒక గిగావాట్‌ హైపర్‌స్కేల్ డేటా సెంటర్‌ ఏర్పాటు కానుందన్నారు. ఈ మెగా - ప్రాజెక్ట్‌తో డేటా రంగంలో దేశానికి విశాఖ తలమానికం కానుందని చెప్పారు. ఏపీలో భారీ పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం వేగవంతం అవుతుండటంతో, కొత్త టెక్నాలజీ - ఎకోసిస్టమ్‌ ఏర్పడే అవకాశం ఉందన్నారు.

Tags

Next Story