Kurnool: ఇష్టంలేకుండా ముద్దుపెట్టాడని నాలుక కొరికేసింది

Kurnool: ఇష్టంలేకుండా ముద్దుపెట్టాడని నాలుక కొరికేసింది
భర్త నాలుక కొరికేసిన భార్య

కర్నూలులో వింత ఘటన చోటు చేసుకుంది.ఏకంగా తన భర్త నాలుక కొరికేసింది ఓ భార్య. భార్యను ముద్దుపెట్టుకునేందుకు ప్రయత్నించిన భర్త నాలుకను భార్య కొరికేసింది. దీంతో తీవ్రంగా గాయపడిన తారాచంద్ నాయక్ చికిత్స నిమిత్తం గుత్తి ఆసుపత్రికి వచ్చారు. పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు.ఈ సంఘటనపై జొన్నగిరి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తనపై దాడి చేసి తనకు ఇష్టం లేకుండా బలవంతంగా తనకు ముద్దు పెట్టేందుకు వచ్చినందుకే ఇలా చేవానని భార్య పుష్పావతి జొన్నగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

గుంటూరు జిల్లాకు చెందిన తారాచంద్ నాయక్..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెందిన పుష్పవతిని 2015లో ప్రేమ వివాహం చేసుకున్నారు.వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. అయితే గత రెండు సంవత్సరాలు నుండి వీరి మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఇవాళ కూడా వీరి మధ్య ఘర్షణ జరిగింది. అయితే ఈ నేపధ్యంలో భార్య దగ్గరకు వెళ్లిన భర్త నాలుకను భార్య కొరికేసింది.

Tags

Read MoreRead Less
Next Story