క్షుద్రపూజల కలకలం.. సృహతప్పి పడిపోయిన వ్యక్తి
X
By - Nagesh Swarna |6 Nov 2020 8:58 PM IST
చిత్తూరుజిల్లాలో క్షుద్రపూజలు తీవ్రకలకలం రేపాయి. కుప్పం మండలం కృష్ణదాసనపల్లిలో క్షుద్రపూజల వ్యవహారం స్థానికులను కలవరపాటుకు గురిచేసింది. నగేష్ అనే అతను సురేష్ అనే వ్యక్తికి తీర్థం తాగించడంతో అతను సృహతప్పి పడిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన గ్రామస్తులు సురేష్ ను కాపాడారు. నగేష్ అనే అతను క్షుద్రపూజలకు పెద్దయెత్తున ఏర్పాట్లుచేయడంతో గ్రామస్తులు జంకుతున్నారు. బాధితుడు సురేష్ కుప్పం పోలీస్టేషన్లో పిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేస్తునారు. నిందితుడు నగేష్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com